చేవెళ్లరూరల్, సెప్టెంబర్ 23 : రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం నగరంలోని మంత్రి నివాసం, జేపీఎల్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొకేలు అందజేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ నియోజకవర్గ మాజీ యూత్ అధ్యక్షుడు వనం లక్ష్మీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో భారీగా నాయకులు తరలివెళ్లి మంత్రి మహేందర్రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మహేందర్రెడ్డి, మైనార్టీ నాయకుడు అలీ, నాయకులు యాదిరెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, కె.భాస్కర్, విక్రంగౌడ్, దేవదాస్ ఫకీర్, మోదిన్షా, బి.గణేశ్ ఉన్నారు.
మంత్రిని కలిసిన చేవెళ్ల ప్రజాప్రతినిధులు
చేవెళ్లటౌన్ : తెలంగాణ రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి మహేందర్రెడ్డి జన్మదిన వేడుకలను చేవెళ్ల మండల నాయకులు నగరంలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి మహేందర్రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన నివాసంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, జడ్పీటీసీ మాలతికృష్ణారెడ్డి వేర్వేరుగా కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను కలిసిన వారిలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్, మాజీ మండల అధ్యక్షుడు రమేశ్వర్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింహులు, మాజీ సర్పంచ్ జంగారెడ్డి, ఎంపీటీసీలు, నాయకులు రమణారెడ్డి, తదితరులు ఉన్నారు.
శంకర్పల్లి నేతల ఆధ్వర్యంలో..
శంకర్పల్లి : తెలంగాణ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి జన్మదినం సందర్భంగా నగరంలోని ఆయన నివాసంలో శంకర్పల్లి మండల, మున్సిపాలిటీ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్దన్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాపారావు, బీఆర్ఎస్ మున్సిపల్, మండల అధ్యక్షుడు వాసుదేవ్కన్నా, గోపాల్, నాయకులు ప్రవీణ్కుమార్, శ్రీధర్, దండు సంతోశ్, శ్రీనివాస్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, కాశీనాథ్, ప్రసాద్ పాల్గొన్నారు.