వికారాబాద్ : ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుకాదేవి తెలిపారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని భవిత కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో వినికిడి లోపం గల విద్యార్థులకు హియరింగ్ మిషన్లు, బుద్దిమాంద్యం గల విద్యార్థులకు ఎంఆర్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఈవో రేణుకాదేవి మాట్లాడుతూ విద్యార్థులు హియరింగ్ మిషన్లు, ఎంఆర్కిట్స్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జిల్లాలోని అలింకో క్యాంపు ద్వారా ఈ ఉపకరణాలు పంపిణీ చేసినట్లు ఐఈకో ఆర్డినేటర్ రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో బాబుసింగ్, ఐఈఆర్పీలు ప్రియాంక, వీరమణి, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.