షాద్నగర్టౌన్, అక్టోబర్ 16: దేవీ నవరాత్రోత్సవాలు షాద్నగర్ పట్టణంలో వైభవంగా సాగుతున్నాయి. పట్టణంలోని శివమారుతిగీతా అయ్యప్ప మందిరంలో సోమవారం అమ్మవా రు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో అమ్మవారు పార్వతీదేవి అవతారంలో.. పెద్ద జానమ్మపేట లక్ష్మీవేంకటేశ్వరాలయంలో బాలాత్రిపురాసుందరీదేవిగా దర్శనమిచ్చారు. ఉదయం నుం చే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
చేవెళ్లటౌన్: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగం గా చేవెళ్లలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం లో స్వామి వారు సోమవారం ప్రత్యేక పూజలు అందుకున్నారు. మండలకేంద్రంలోని రచ్చబం డవద్ద ప్రతిష్ఠించిన అమ్మవారికి భక్తులు పూజలు చేసి మొక్కు లు చెల్లించుకున్నారు. రెండోరోజు అమ్మవారు గాయత్రీదేవిగా దర్శనమిచ్చారు.
షాద్నగర్రూరల్ : ఫరూఖ్నగర్ మండలంలోని ఎలికట్ట అంబాభవానీ ఆలయంలో భవానీమాతను సోమవారం గాయత్రీదేవిగా అలంకరించారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు రారు. పూజలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎలికట్ట సర్పంచ్ సాయిప్రసాద్, ఆలయ చైర్మన్ కృష్ణయ్య పాల్గొన్నారు.
కొత్తూరు : అమ్మవారి కృప అందరిపై ఉండాలని ప్రార్థించినట్లు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవేందర్యాదవ్ అన్నారు. ఆయ న కొత్తూరు మున్సిపాలిటీ పాత కార్యాలయం వద్ద ప్రతిష్ఠించిన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.