బొంరాస్పేట, డిసెంబర్ 28: దేవులానాయక్తండాలో గిరిజనులు దస రావ్ ఉత్సవాలను బుధవారం ఘనంగా జరుపుకొన్నారు. తమ ఆరాధ్య దైవమైన తుల్జా భవానీ మాతను దర్శించు కోవ డానికి తుల్జాపూర్కు వెళ్లి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లిం చుకున్నారు. అనంతరం తండాకు వచ్చి పండుగ సంబురాలను ఆనందో త్సహాల మధ్య జరుపుకొన్నారు.
సంప్రదాయ దుస్తులు ధరించి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలను ఈ ఉత్సవాలు ప్రతిబింబిస్తాయని బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు నెహ్రూ నాయక్ అన్నారు. ఉత్సవాల్లో ఉప సర్పంచ్ సూర్యానాయక్, పండరి, శం కర్నాయక్, తులసీరాం నాయక్, బలరాం, విష్ణు, సంతోష్ పాల్గొన్నారు