లంబోధరుడు కొలువుదీరగా బుధవారం గణేశ్ నవరాత్రోత్సవాలు అట్టహాసంగా షురూ అయ్యాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భక్తులు అధిక సంఖ్యలో గణనాథులను ప్రతిష్ఠించి పూజలు చేశారు. యువత పోటీపడి మండపాలను భారీ సెట్టింగ్లు, విద్యుద్దీపాలతో అందంగా తీర్చిదిద్దారు. జై గణేశా.. జై జై గణేశా అనే నినాదాలతో పలు ప్రాంతాలు మార్మోగాయి.
వినాయక చవితిని పురస్కరించుకొని పల్లె, పట్టణాల్లోని వాడవాడలా గణనాథులను భక్తులు ప్రతిష్ఠించి పూజలు చేశారు. వినాయకుడికి 21రకాల ఆకులు, పూలు, పండ్లు, దీప, దూప, నైవేద్యాలతో పాటుగా ఉండ్రాలను సమర్పించారు. సర్వ విఘ్నాలను తొలగించాలని భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు. సినిమా సెట్టింగ్లను తలపించేలా మండపాలను ఏర్పాటు చేసి జిగేల్మనేలా విద్యుత్ దీపాల మధ్య వివిధ రకాల గణేష్ ప్రతిమలను నెలకొల్పారు. దీంతో ఊరూరా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది.
– న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ