యాచారం, మే 5 : వంద రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని చేయని రేవంత్రెడ్డి ప్రభుత్వం సిగ్గులేనిదని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. మండల కేంద్రంలో ఆదివారం భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్కు మద్దతుగా రోడ్షో నిర్వహించగా, ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్పా సీఎం రేవంత్రెడ్డి ఒరుగబెట్టిందేమీలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో రైతుభరోసా డబ్బులు లేవు, రుణమాఫీ లేదు, కల్యాణలక్ష్మి తులం బంగారం లేదు, పింఛన్లు తదితర వాటినన్నింటినీ గాలికొదిలేశారని మండిపడ్డారు.
అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశం మొత్తం బడాబాబుల చేతుల్లో ఉంటుందన్నారు. మతోన్మాదం, అరాచకాలు పెరిగి సామాన్యుల బతుకు భారమవుతుందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జనగాం మాజీ ఎమ్మెల్యే, ఎన్నికల ఇన్చార్జి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి ఉన్నదన్నారు.
తాటాకు చప్పుళ్లకు భయపడేదిలేదు.. రేవంత్రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకో.. అని హెచ్చరించారు. కొంత మంది పార్టీని వీడినంత మాత్రాన బీఆర్ఎస్కు నష్టం లేదన్నారు. దొంగలకు బీఆర్ఎస్లో చోటులేదని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ మాట్లాడుతూ తనను గెలిపిస్తే కాంగ్రెస్ మెడలు వంచి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయ మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్కు నల్లగొండ ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, రైతుబంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, జడ్పీటీసీ జంగమ్మ, మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి భాష, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మంచాల : అబద్ధాల కాంగ్రెస్, బీజేపీలకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని, బడుగు బలహీన వర్గాలకు చెందిన క్యామ మల్లేశ్ను భువనగిరి ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రజలను కోరారు. ఆదివారం రాత్రి మంచాల గ్రామంలోని ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలంటూ గారడీ చేసి గద్దెనెక్కిందన్నారు.
ఐదు నెలలు దాటినా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంటు అభ్యర్థి క్యామ మల్లేశ్ మాట్లాడుతూ తెలంగాణ వాణి పార్లమెంట్లో వినిపించాలంటే బీసీ బిడ్డనైన తనను గెలిపించాలని కోరారు. అబద్ధాలతో ప్రజలను మోసం చేయడానికి వస్తున్న కాంగ్రెస్, బీజేపీలను నమ్మవద్దన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్రెడ్డి, ఎంపీపీ నర్మద, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు చీరాల రమేశ్, బహదూర్, నాయకులు పుల్లారెడ్డి, జంబుల కిషన్రెడ్డి, మొగిలి వెంకటేశ్, మొగిలి పావణి, జగన్రెడ్డి, రావు శంకర్, సుకన్య, చిందం రఘుపతి, కందాల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.