పరిగి, ఫిబ్రవరి 1 : మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లతో బీఆర్ఎస్ గెలిచిందని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి మాట్లాడడం అవివేకానికి నిదర్శనమని, ఆయన సైతం దొంగ ఓట్లతోనే ఎమ్మెల్యేగా గెలుపొందారా..? అని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ప్రశ్నించారు. పరిగిలోని 13వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సమీనా తాహెర్ అలీకి మద్దతు పలుకుతూ స్వతంత్ర అభ్యర్థి నరేందర్ నామినేషన్ ఉపసంహరించుకుంటానని ప్రకటించి మహేశ్రెడ్డిని కలిసి మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఉన్న ఓట్లే ప్రస్తుతం ఉన్నాయని, అలాంటప్పుడు రామ్మోహన్రెడ్డి సైతం దొంగ ఓట్లతోనే ఎమ్మెల్యేగా గెలిచారా..? అని ప్రశ్నించారు. పరిగి మున్సిపాలిటీలో ఒక్క కౌన్సిలర్ బీఆర్ఎస్ గెలుస్తుందా..? అని ఎమ్మెల్యే సవాల్ విసిరారని, ఏ పార్టీ ఎన్ని కౌన్సిలర్లను గెలుస్తుందో 13వ తేదీన తెలుస్తుందని, అప్పుడు తప్పకుండా తాము చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు మద్దతు ప్రకటించారని, మున్సిపల్ ఎన్నిక ల్లోనూ పరిగిలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మీర్ మహమూద్అలీ, ప్రవీణ్కుమార్రెడ్డి పాల్గొన్నారు.