కులకచర్ల, ఏప్రిల్ 29 : బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుకోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, పార్టీ చౌడాపూర్ మండల అధ్యక్షుడు సత్తినేని సుధాకర్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కులకచర్ల, చౌడాపూర్ మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం, విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీతోనే సంక్షేమ పథకాలు అమలు జరిగాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న చేవెళ్ల ఎంపీ అభ్యర్ధిని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని కార్యకర్తలకు సూచించారు.
చేవెళ్ల ఎంపీ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ బీసీలకు కేటాయించిందని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. బీసీలకు ఎంపీ టీకేట్ కేటాయించడాన్ని ప్రతి బీసీ నేతలు స్వాగతించారని, ఇందుకోసం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పరిగి ప్రాంతానికి దొరికిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించి గెలుపు కోసం సహకరించాలని సూచించారు.
ఎన్నికల్లో గారడి చేసే పార్టీలకు, నాయకులను నమ్మరాదని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఓట్లకోసం వచ్చే నాయకులను నమ్మి మోసపోకుండా జాగ్రత్త వహించాలని, ఈ విషయాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో తెలియజేయాల న్నారు.
కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంటు ఎన్నికల ఇన్చార్జి రామచందర్రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కొప్పుల అనిల్రెడ్డి, కులకచర్ల జడ్పీటీసీ రాందాస్నాయక్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగరాజు, రాజప్ప, సారా శ్రీనివాస్, మాలె కృష్ణయ్యగౌడ్, దామో దర్రెడ్డి, అంతారం మొగులయ్య, రఘు, నర్సింహులు, గుండుమల్ల నర్సింహులు, శంకర్నాయక్, గండి లక్ష్మయ్య, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య, చౌడాపూర్ మండల యువజన విభాగం అధ్యక్షుడు మేగ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.