చేవెళ్ల రూరల్, జూలై 20 : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్)కార్యక్రమాన్ని పూర్తి పారదర్శకంగా చేపట్టాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఆమె మండలంలోని కౌకుంట్ల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తిక్రెడ్డితో కలిసి ఎన్యూమరేషన్ ఫారాలను నింపి బూత్ స్థాయి అధికారికి అందజేశారు. అనంతరం ఆమె గ్రామంలో విస్తృతంగా పర్యటించి ప్రజలను కలిసి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి సర్ ప్రక్రియను పరిశీలించారు. అధికారులు, సిబ్బందితో మాట్లాడి ఎన్యూమరేషన్ ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఓటరూ ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి గడువులోగా సమర్పించాలన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, కౌకుంట్ల సర్పంచ్ మల్లారెడ్డి, పంచాయతీ కార్యదర్శి దేవేందర్గౌడ్, అంతారం మాజీ సర్పంచ్ సులోచనాఅంజన్గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు రాము, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.