పరిగి, ఫిబ్రవరి 11: పరిగి పట్టణంలోని శ్రీ షిర్డీ సాయి ధ్యాన మందిరం 20వ వార్షికోత్సవం సందర్భంగా ఉత్సవాలు ఘనం గా జరిగాయి. రెండవ రోజు ఆదివారం ఉదయం 5.15 గంటలకు కాగడ హారతి, 6 గంటలకు సుప్రభాతము, 7 గంటలకు అభిషేకం, 9 గంటలకు స్వామి వారికి ఉచిత సామూహిక సాయి వ్రతములు, 10 గంటలకు స్వామి వారికి చందనోత్స వం, ఉదయం 11.30 గంటలకు సాయి సేవకులచే సత్సంగం, అనంతరం సాయి సేవక్ సాయి పురోహిత్ చే ప్రసంగ కార్యక్రమాలు నిర్వహించారు.
మధ్యాహ్నం 12 గంటలకు సాయిబాబాకు హారతి, సాయంత్రం 4 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, సాయంత్రం 6.30 గంటలకు పుష్పాభిషేకం, సాయంత్రం 7.15గంటలకు శ్రీ శివపార్వతుల కల్యాణోత్సవం నిర్వహించారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు ‘ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి’ అఖండ సాయినామ సంకీర్తన జరిగింది.
ఉత్సవాల్లో పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఆలయ కమిటీ వారు ఘనంగా సన్మానించారు. ఉత్సవాలలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, జడ్పీటీసీ బి.హరిప్రియ-ప్రవీణ్కుమార్రెడ్డి దంపతులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు ఎస్పీ బాబయ్య, ఆర్.ఆంజనేయులు, నాయకులు ఎస్.భాస్కర్, కృష్ణ, పాలాది శ్రీనివాస్, బి.రవికుమార్, హన్మంతు పాల్గొన్నారు.