రంగారెడ్డి : ప్రతి ఒక్కరు స్వయం ఉపాధిలో రాణించాలని విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం తుక్కుగూడ పరిధిలోని ఇమాంగూడలో టేస్టీ మండిని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తో కలిసి ఆమె ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..నేటి సమాజంలో స్వయం ఉపాధిద్వారానే ఎక్కువగా సంపాదనను అర్జిస్తున్నారని అన్నారు.
స్వయం ఉపాధిని ఎంచుకున్న వారు జీవితంలో స్థిరపడగల్గుతున్నారని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవాని, కౌన్సిలర్లు సప్పిడి లావణ్య, పద్మ, బోద యాదగిరిరెడ్డి, రెడ్డిగళ్ల సుమన్, బూడిద తేజస్విని, జిల్లా పౌర సరఫరాల విజిలెన్స్ కమిటీ సభ్యురాలు ఎల్లగొండ పద్మ , నిర్వాహకులు శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.