హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని ఖాజాగూడలో విద్యుత్ విజలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపురి కాలనీలో అక్రమ విద్యుత్ కనెక్షన్లను గుర్తించారు. దీంతో విద్యుత్ దొంగతనానికి పాల్పడిన 10 మందిపై కేసులు నమోదుచేశారు. మీటర్లు లేకుండా ట్రాన్స్ఫార్మర్ నుంచి అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్నారని చెప్పారు. వారికి రూ.78 లక్షలు జరిమానా విధించామన్నారు. కాగా, కరెంటు చౌర్యంలో స్థానిక విద్యుత్ సిబ్బంది పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అలాంటివారిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.