యాచారం, జూన్24 : ముదిరాజ్ల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో ఆయన శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో కలిసి ముదిరాజ్ సంఘం నూతన కార్యాలయాన్ని ప్రారంభించి, ముదిరాజ్ సంఘం జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముదిరాజ్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. ముదిరాజ్ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. ముదిరాజులకు ఉచితంగా చేప పిల్లలు, ద్విచక్ర వాహనాల పంపిణీ చేసిందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మత్సకారులుగా వృత్తి చేసుకుంటున్న ముదిరాజ్లను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం మత్సకారుల కుటుంబాలకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుందన్నారు. అనేక సంక్షేమ పథకాలతో ఆదుకుంటుందన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ జంగమ్మ, పీఏసీఎస్ చైర్మేన్ రాజేందర్రెడ్డి, ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు నీలం శ్రీకాంత్, నాయకులు వెంకటేష్, రాజు, కృష్ణ, అశోక్, గణేష్, భిక్షపతి, నరేష్, ఎల్లేష్, టీఆర్ఎస్ నాయకులు క్యామ మల్లేష్, రమేష్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.