అబ్దుల్లాపూర్మెట్, మార్చి 18 : జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో నీటి సమస్య తీవ్రమైంది. 15 రోజులుగా నీరు రాక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదే అదునుగా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లవారు అందినకాడికి దండుకుంటున్నారు. ఒక్క డ్రమ్ము నీటిని రూ.100 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.