మొయినాబాద్, సెప్టెంబర్ 25: క్రీడలు జాతీయ సమైక్యతాభావాన్ని పెంచుతాయని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని పెద్దమంగళారం గ్రామంలో ఉన్న తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల/కళాశాలలో మూడు రోజులపాటు జరుగనున్న జిల్లా స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ను సోమవారం ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, సర్పంచ్ నరోత్తంరెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి వెలిగించి..
జాతీయ పతకాన్ని ఆవిష్కరించి క్రీడల జ్యోతిని వెలిగించి, గాలిలోకి బెలూన్లను వదిలారు. విద్యార్థినుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మైనారిటీ బాలికలకు నాణ్యమైన విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల/కళాశాలలను ఏర్పాటు చేశారన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 23 బడులను ఏర్పాటు చేసి విద్యార్థినులకు నాణ్యమైనవిద్యను అందిస్తున్నారన్నారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య ను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 1100 గురుకుల పాఠశాలలను స్థాపించి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇందు లో చదివే వారికి నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారని.. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి విద్యార్థి ఏడాదికి రూ.1.35 లక్షలు ఖర్చు చేస్తున్నదన్నారు. రాష్ట్రం ఎడ్యుకేషన్ హబ్గా మారిందని కొని యాడారు.
12 పాఠశాలల నుంచి 600 మంది..
పెద్దమంగళారంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల ఆవరణలో నిర్వహించిన జిల్లా స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల కు చెందిన 12 పాఠశాలల నుంచి 600 మంది విద్యార్థిను లు పాల్గొన్నారు. అండర్-14, అండర్-17 విభాగాల్లో పో టీలు నిర్వహించారు. వాలీబాల్, ఖోఖో, టెన్నికాయింట్, బాల్ బ్యాడ్మింటన్,అథ్లెటిక్స్ నిర్వహిస్తున్నారు.
తెలంగాణ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వివిధ రకాల పోటీల్లో ప్రోత్సహిస్తున్నదన్నారు. క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులకు మూడు రోజులపాటు పౌష్టికాహారం, పండ్లు, మాంసాహారం అందించడం జరుగుతుందన్నారు. క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ గెలువరని.. ఓటమిని గెలుపుగా స్వీకరించి గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.
గురుకులాల ఖ్యాతిని ప్రపంచానికి చాటాలన్నారు. కార్యక్రమంలో టీఎంఆర్ఈఐఎస్ జాయింట్ సెక్రటరీ, జిల్లా ఇన్చార్జి షేక్ లియాకత్ హుస్సెన్అలీ, మండల విద్యాధికారి వెంకటయ్య, రీజినల్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్, విజిలెన్స్ ఆఫీసర్ రహీం, వైస్ ఎంపీపీ మమత, ఎంపీటీసీలు శ్రీలత, మల్లేశ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు జయవంత్, నాయకులు రవియాదవ్, కృష్ణారెడ్డి, గోపాల్రెడ్డి, దాన్రెడ్డి, లక్ష్మీనారాయణ, జైపాల్రెడ్డి, నాగరాజు, రాజు, పరమేశ్, మహేశ్యాదవ్,అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.