ఆమనగల్లు, జూలై 24 : సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. నిరుపేదలకు చేసే సాయం, మంచి పనులు శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు. సోమవారం ఆమనగల్లు పట్టణంలో ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీసింగ్ తన స్వచ్ఛంద సంస్థ అయిన బాలా జీ చారిటబుల్ ట్రస్టు ద్వారా నిరుపేదలకు కుట్టు మిషిన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎమ్మెల్సీ, ఎమ్మె ల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి మున్సిపాలిటీలోని 24 మంది నిరుపేద మహిళలకు కుట్టుమిషిన్లను అందజేశారు.
ఈ సందర్భంగా ప్రధాన వక్తలు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఠాగూర్ బాలాజీసింగ్ను అభినందించారు. అనంతరం బాలాజీసింగ్ మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలను తమ ట్రస్టు తరఫున నిరంతరం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అనురాధ, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు పత్యానాయక్, ఎంపీటీసీ కుమార్, నారాయణ, మాజీ గంథ్రాలయ సంస్థ మాజీ డైరెక్టర్ జంగయ్య, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కేశవులు , ఏఎంసీ డైరెక్ట ర్ సుభాష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అల్లాజీ, మహేశ్, సాయిలు, వెంకటయ్య, వెంకటేశ్, రాము, మెకానిక్ బాబా, విజయ్రాథోడ్, కిరణ్, ప్రసాద్, సతీశ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.