వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో భూ సమస్యలతో సతమతం అవుతున్న వారికి డయల్ ఇన్ గ్రీవెన్స్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన డయల్ ఇన్ గ్రీవెన్స్ కార్యక్రమానికి భూ సమస్యలపై 22 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ కార్యక్రమం ద్వారా వెంటనే పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రతి బుధవారం వికారాబాద్ కలెక్టరేట్లో ధరణి భూ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఉదయం 9 నుంచి 10:30 గంటల వరకు ఫోన్ చేసి సమస్యలు విన్నవించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ తాసీల్దార్లు శ్రీధర్, సుధా, నిరంజన్రావు, ఈడీఎం మహమూద్అలీ, ధరణి కో-ఆర్డినేటర్ నర్సింహ పాల్గొన్నారు.