తుర్కయాంజాల్, డిసెంబర్ 3: పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని జేబీఆర్ ఫంక్షన్హాల్లో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మున్సిపాలిటీ అధ్యక్షుడు వేముల అమరేందర్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. అనంతరం 25 మందితో కూడిన కమిటీలను ఏర్పాటు చేశారు. సమావేశంలో కౌన్సిలర్ కల్యాణ్ నాయక్, సహకార సంఘం డైరెక్టర్ సామ సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్లు కందాడి లక్ష్మారెడ్డి, చెవుల దశరథ, టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్ల కృష్ణ, సుదర్శన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్, కుర్మ సంఘం అధ్యక్షుడు బాబయ్య, నాయకులు కొత్తకుర్మ కార్తిక్, చెక్క బాల నర్సింహ్మ, యాదిరెడ్డి, నిరంజన్రెడ్డి, విజయానంద్రెడ్డి, దయానంద్, నర్సిరెడ్డి, మేతరి శంకర్ పాల్గొన్నారు.
కేశంపేట : టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలు కృషి చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్రెడ్డి అన్నారు. శనివారం లింగంధన, తొమ్మిదిరేకులలో పార్టీ కార్యకర్తల సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం ఆయా గ్రామాల్లో పార్టీ బలోపేతం కోసం 100 మంది ప్రజలకు బూత్ను ఏర్పాటు చేసి, బూత్ కమిటీ సభ్యులను నియమించారు. కార్యక్రమంలో మండల కోఆప్షన్ మెంబర్ జమాల్ఖాన్, ఎంపీటీసీ యాదయ్య, సీనియర్ నాయకుడు లక్ష్మీనారాయణగౌడ్, నాయకులు బాల్రాజ్, మధుసూదన్గౌడ్, సుదర్శన్, నరేందర్రెడ్డి, రాంరెడ్డి, నర్సింహ్మ, వెంకట్, కృష్ణ, రామస్వామి, భాస్కర్ పాల్గొన్నారు.