కేశంపేట : హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు కేశంపేట ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మండలంలోని ఎక్లాస్ఖాన్పేట పరిధిలోని వ్యవసాయ పొలాల్లో మంగళవారం గుర్తు తెలియని మహిళ అపస్మారక స్థితిలో ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ బుధవారం ఆమె మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. చనిపోయిన మహిళ వివరాల కోసం కేశంపేట పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ తెలిపారు.