బషీరాబాద్ : కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన గొట్టిగఖుర్ధు గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం ఎస్సై విద్యాచరణ్రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. మండల పరిధిలోని గొట్టిగఖుర్ధు గ్రామానికి చెందిన మొహ్మద్ బిజాని (26)కి ఎనిమిది సంవత్సరాల క్రితం పర్వత్పల్లి గ్రామానికి చెందిన పాషతో వివాహం అయింది. వీరికి ఇద్దరు సంతానం ఒక కుమారుడు, ఒక కూతురు. తాండూరులో ఉంటూ జీవనం కొనసాగించేవారు. కొన్ని రోజుల క్రితం మొహ్మద్ బిజాని వారి సొంత గ్రామమైన గొట్టిగఖుర్ధుకు వచ్చింది.
అయితే శనివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తాండూరు జిల్లా దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నమని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.