బండ్లగూడ: రాజేంద్రనగర్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని ఐదు, ఎనిమిదవ వార్డులలో 96లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు స్థానిక మేయర్ మహేందర్గౌడ్, డిప్యూటి మేయర్ రాజేందర్రెడ్డి, కార్పొరేటర్లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులు సహకరించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయలన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వేణుగోపాలరెడ్డి, కార్పొరేటర్లు భూపాల్గౌడ్, ప్రశాంత్ నాయక్, కోఅప్షన్ సభ్యులు మాలాకీ రత్నం, బిజేఎంసీ టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేశ్గౌడ్, నాయకులు రావులకోళ్ల నాగరాజు,పాపయ్య యాదవ్, అజయ్, ఖాజా, రాజు, సుమన్గౌడ్, సందిప్, వీరస్వామిగౌడ్ తదతరులు పాల్గొన్నారు.