బొంరాస్పేట : మండలంలోని మదన్పల్లి తండాకు చెందిన 30మంది కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. తండాకు చెందిన రాజు నాయక్, దిలీప్, ఛత్రానాయక్, బాలు నాయక్, న్యానాయక్, శంకర్ నాయక్, రాములు నాయక్తో పాటు 30మంది కార్యకర్తలు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి తాము టీఆర్ఎస్లో చేరుతున్నామని వారు తెలిపారు. పార్టీలో చేరిన కార్యకర్తలను ఎమ్మెల్యే అభినందించి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
మదన్పల్లితండా నుంచి ఇబ్రాహింపూర్ గ్రామానికి బీటీ రోడ్డు మంజూరు చేయించాలని, తండాలో సీసీ రోడ్లు నిర్మించాలని కార్యకర్తలు ఎమ్మెల్యేను కోరగా తప్పకుండా నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపడుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మదన్పల్లితండా సర్పంచ్ సురేశ్, జడ్పీటీసీ హాన్ అరుణాదేశు, టీఆర్ఎస్ నాయకులు టీటీ రాములు, దేశ్యానాయక్ పాల్గొన్నారు.