కడ్తాల్, జనవరి 9 : ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు, తండాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో సీఆర్ఆర్ నిధులు రూ.కోటితో చేపట్టిన గుర్లకుంటతండా-కడ్తాల్ బీటీ రోడ్డు నిర్మాణ పనులు, సాయిరాంనగర్ కాలనీలో రూ.35 లక్షలతో చేపట్టిన లక్ష లీటర్ల సామర్థ్యం గల మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, రూ.7.50 లక్షలతో చేపట్టిన వ్యవసాయ మార్కెట్ చెక్పోస్టు భవనం, బీసీ కాలనీలో రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి, కేఎల్ఐ పథకాలతో నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందిస్తామన్నారు. కడ్తాల్ మండలాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని, మండల కేంద్రంలో అన్ని శాఖలకు సొంత భవనాలను నిర్మిస్తామని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ప్రజాప్రతినిధులు సన్మానించారు.
కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, వైస్ ఎంపీపీ ఆనంద్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, మండలాధ్యక్షుడు వీరయ్య, గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పరమేశ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఏఎంసీ, పీఏసీఎస్ డైరెక్టర్లు, ఉప సర్పంచ్లు, నాయకులు, ఎంపీడీవో రామకృష్ణ, ఏంపీవో మధుసూదనచారి, మిషన్ భగీరథ డీఈఈ సందీప్, ఏఈ శ్రావ్య, పీఆర్ ఏఈ పరమేశ్, మార్కెట్ యార్డు కార్యదర్శి సరోజ, సూపర్వైజర్ శ్రీశైలం, పంచాయతీ కార్యదర్శి జగన్ పాల్గొన్నారు.