వికారాబాద్/ఇబ్రహీంపట్నం, జూలై 7: ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరిం చాలని రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ అన్నారు. శుక్ర వారం ఆయన జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లతో హైద రాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. జీవో నం.58, 59, 76, 118 కింద భూ క్రమబద్ధ్దీకరణ, ధరణి పెండింగ్ దరఖాస్తులు, ధరణిలో నూతన ఆప్షన్పై సమీక్షించారు. ఈ సందర్భంగా నవీన్ మిట్టల్ మాట్లాడుతూ జీవో 59లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదా రులు సంబంధిత నిర్ణీత ఆమౌంట్ను సకాలంలో చెల్లించేలా చర్యలు తీసు కోవాలన్నారు. ధరణికి సంబంధించి ఎలాంటి దరఖాస్తులు పెండింగ్లో లేకుండా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పరిష్కరించాలని కలెక్టర్లకు సూచించారు.
ధరణి కొత్త ఫీచర్స్ను ఈ సందర్భంగా వివరించారు. జీవో 58 కింద గతం లో 20,668 మందికి పట్టాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధం చేశామని, వాటిలో 561 పట్టాల పంపిణీ ఇంకా పెండింగ్లో ఉందని.. దీనిని 2 రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. జీవో 118 కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులను 15 రోజుల్లో పూర్తిచేయాలన్నారు. ఈ కాన్ఫరెన్స్లో కలెక్టర్ నారాయణరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లింగ్యానాయక్, సెక్షన్ సూపరింటెండెం ట్ హరిత తదితరులు పాల్గొన్నారు.
కాగా రంగారెడ్డి జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ 58, 59, 118 కింద జిల్లాలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి వెంటనే పరిష్కరిస్తామని.. ధరణి పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్లో కలెక్టర్తోపా టు జిల్లా అదనపు కలెక్టర్లు ప్రతీక్జైన్, తిరుపతి రావు, రెవెన్యూ అధికారి హరిప్రియ, ఆర్డీవోలు వెంకటాచారి, సూరజ్, వేణుగోపాల్, తహసీల్దార్లు పాల్గొన్నారు.