రంగారెడ్డి, జనవరి 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఏ.శాంతి కుమారిని బీఆర్కే భవన్, ఆమె చాంబర్స్లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ శుక్రవారం కలిసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా ప్రజలకు అన్నీ శుభాలే సమకూరాలి
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కలెక్టర్ అమయ్ కుమార్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు ప్రకటించారు. భోగ భాగ్యాలను ఇచ్చే భోగి, సరదాలు పంచే సంక్రాంతి వేడుక ప్రజలందరికీ మరింత ఆనందం పంచాలని వారు ఆకాంక్షిం చారు. ఈ నూతన సంవత్సరంలో అన్నీ శుభాలే సమకూరా లని, అనుకున్న పనులన్నీ నెరవేరాలని, ఏడాది పొడగునా ఇంటింటా సిరుల కాంతులు విలసిల్లాలని అభిలషించారు.