వికారాబాద్, జనవరి 11 : కొడంగల్ మున్సిపాలిటీతోపాటు నియోజకవర్గాభివృద్ధికి అధికారులు చర్యలు చేపట్టాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నా రు. గురువారం కలెక్టరేట్లో ని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కొడంగల్ పట్టణ సుందరీకరణపై ఆయన ఎన్సీపీఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా (పీ) లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సుభానితో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చేపట్టాల్సిన పనులను పరిశీలించారు.
కొడంగల్ మున్సిపల్ పరిధిలో పార్కులు, పక్కా సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, అంబేద్కర్ జంక్షన్, చెరువుకట్ట అభివృద్ధితోపాటు చెరువు వద్ద బతుకమ్మఘాట్, నిమజ్జనం, డంపింగ్ యార్డ్డు, క్రిమిటోరియం, క్రీడాప్రాంగణం, సెంట్రల్ లైటింగ్ తదితర అంశాలపై చర్చించారు. అవసరమైన నిధుల గురించి సంబంధిత అధికారులతో మాట్లాడుతానన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్శర్మ, లింగ్యానాయక్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ నారాయణఅమిత్, కొడంగల్, వికారాబాద్ మున్సిపల్ కమిషనర్లు ప్రవీణ్కుమార్, జాకీర్అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.