పెద్దేముల్ : రైతులను ఆదుకుంటున్న ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ని మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో యాసంగిలో రైతులకు రైతుబంధు ద్వారా పంటలకు పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేయడాన్ని హర్షిస్తూ స్థానిక రైతులు, నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కిషన్రావు మాట్లాడుతూ యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో రైతుల కోసం ప్రత్యేకంగా రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తున్నారన్నారు.
రైతుల సంక్షేమం కోసం పని చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఎదైనా ఉందా అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు డివై ప్రసాద్, ఉపాధ్యక్షుడు వెంకట్, మండల రైతుసంఘం అధ్యక్షుడు క్రిష్ణాగౌడ్, టీఆర్ఎస్ మండల కార్యదర్శి రంగయ్య, నాయకులు పాల్గొన్నారు.