కాంగ్రెస్పై రైతులకు ఉన్న అనుమానాలు ఎన్నికల ముందే పటాపంచలయ్యాయి. ఆ పార్టీవన్నీ బూటకపు హామీలేనని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తేటతెల్లమైంది. రైతు బంధును భూమి యజమాని, కౌలు రైతుల్లో ఎవరికో ఒకరికే ఇస్తామంటూ రేవంత్ ఎట్టకేలకు అన్నదాతలపై ఉన్న అక్కసును వెళ్లగక్కాడు. ఇదే జరిగితే కౌలు చిచ్చు రేగి ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో అశాంతి నెలకొనే ప్రమాదముందని, అంతేకాకుండా భూ యాజమాన్య హక్కులకే ఎసరు పెట్టినట్లవుతుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
రైతులు, కౌలుదారుల మధ్య వివాదాలు సృష్టించేలా టీపీసీసీ అధ్యక్షుడు తీరు ఉన్నదని రైతాంగం భగ్గుమంటున్నది. రైతుబంధు వచ్చాక గాడిలో పడ్డ వ్యవసాయం కాంగ్రెస్ కారణంగా ఆగమయ్యే పరిస్థితి ఉన్నదని రైతు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. సీఎం కేసీఆర్ భూ యజమానులకే సర్వహక్కులు కల్పించి పెట్టుబడి అందిస్తున్నారన్నారు. మరోసారి అధికారంలోకి వస్తే ఏటా రూ.16వేల సాయం అందిస్తామంటున్న కేసీఆర్పై తమకు పూర్తిగా విశ్వాసమున్నదని, ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెబుతామని అన్నదాతలు స్పష్టం చేస్తున్నారు.
-రంగారెడ్డి, నవంబర్ 26(నమస్తే తెలంగాణ)
ఎన్నికల్లో గెలిచేందుకే కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలిస్తున్నది. ఆ నాయకుల మాటలను ప్రజలు నమ్మరు. రైతుబంధుపై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తే.. వారు అధికారంలోకి వస్తే ప్రజల బతుకులు ఆగం అవుతాయి. అలాంటి పార్టీని ప్రజలు ఎన్నికల్లో ఓడించాలి. ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మూడోసారి కూడా గెలిపించుకోవాలి.
– మల్లయ్య, రైతు, ఫరూఖ్నగర్ మండలం
రంగారెడ్డి, నవంబర్ 26(నమస్తే తెలంగాణ) : రైతుల అనుమానాలు నిజమయ్యాయి. కాంగ్రెస్వన్నీ బూటకపు హామీలేనని తేలిపోయింది. ఎన్నికలకు ముందే టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి రైతులపై కాంగ్రెస్ కపట ప్రేమ ను బయటపెట్టారు. రైతుబంధును భూమి యజమా ని, కౌలు రైతుల్లో ఎవరో ఒకరికి మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. అంటే..కౌలు రైతుకు ఇస్తే భూమి యజమానికి రాదని అర్థం.
ఇదే జరిగితే భూయజమానులు కుదేలు కాక తప్పని పరిస్థితి. కౌలు చిచ్చు రేగి ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో అశాంతి నెలకొననున్నది. భూయాజమాన్య హక్కులకే ఎసరు పెట్టేలా కుయుక్తులు పన్నుతున్న కాంగ్రెస్ పార్టీ తీరుపై, టీపీసీసీ అధ్యక్షుడు రేవం త్రెడ్డిపై రంగారెడ్డి జిల్లా రైతాంగం భగ్గుమంటున్నది. సీఎం కేసీఆర్ భూయజమానులకే సర్వహక్కులు కల్పించి ఐదేండ్లుగా రూ.3,337.04కోట్ల పెట్టుబడి సా యాన్ని జిల్లా రైతాంగానికి అందించారు.
మళ్లీ అధికారంలోకి వస్తే ఏటా రూ.16 వేల సాయం అందిస్తామని చెబుతున్న కేసీఆర్ మాటపై రైతాంగం విశ్వాసంతో ఉన్నది. అయితే రైతుబంధు వచ్చాక గాడిలో పడ్డ వ్యవసాయం కాంగ్రెస్ పార్టీ కారణంగా ఆగమయ్యే పరిస్థితి ఏర్పడనున్నదని రైతు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. కాంగ్రెస్ వస్తే..మళ్లీ రైతు బతుకులు ఆగం కావడం ఖాయమని పలువురు హెచ్చరిస్తున్నారు.
తొమ్మిదిన్నరేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో రైతులకు చేకూరిన లాభం అంతా ఇంతా కాదు. రైతులకు ఇబ్బం దికరంగా మారిన అనేక సమస్యలను సీఎం తనదైన శైలిలో చెక్పెట్టి రైతులకు ప్రయోజనం చేకూరేలా చర్య లు తీసుకున్నారు. గతంలో వ్యవసాయ భూముల లెక్కలు తికమకగా ఉండేవి. భూమి ఉన్నప్పటికీ చాలామంది రైతులకు రైతుబంధు సాయం అందేది కాదు. భూరికార్డుల ప్రక్షాళన ద్వారా చిక్కుముడులతో కూడిన అనేక సమస్యలకు ధరణితో ప్రభుత్వం పరిష్కారం చూపింది. ధరణి వచ్చాక భూముల కొనుగోలు, అమ్మకాల్లో రైతులకు ఎదురవుతున్న రిజిస్ట్రేషన్ తంతులో అవినీతికి చెక్పడింది.
భూకబ్జాదారుల అక్రమాలకు అడ్డుకట్టవేసి అసలైన వ్యక్తులకే భూ పట్టాలు దక్కేలా చేశారు. ధరణితో రైతుబంధు సాయాన్ని క్రమపద్ధతిలో అర్హులకు నేరుగా వారివారి అకౌంట్లలో జమ అవుతున్నాయి. అయితే ధరణిని తీసేస్తామని చెబుతున్న కాంగ్రెస్ కౌలు కాలమ్ను తీసుకొచ్చి రైతుల బతుకుల ను ఆగమాగం చేసేందుకు కుట్ర పన్నుతున్నది. రైతుకు కౌలుదారుకు మధ్య ఒప్పందం అధికారికంగా జరిగేలా కౌలు చట్టాన్ని తెస్తామని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే రైతుకు ఉరితాడు పేన డం తప్పితే మరోటి కాదని పలువురు పేర్కొంటున్నారు.
గత సమైక్య పాలనలో కుదేలైన రైతును రాజును చేయాలన్న సంకల్పంతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్. రైతుబంధు పథకంతో పెట్టుబడి సాయం ఇచ్చి ఆదుకుంటున్నారు. 2018లో రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టి నేటికి నిర్విఘ్నం గా సాయాన్ని అందిస్తున్నారు. ఆరంభంలో ఎకరాకు రూ.4వేల చొప్పున రెండు పంటలకు రూ.8వేలు ఇ చ్చిన సర్కారు 2019-20 నుంచి ఎకరాకు రూ.5వేల చొప్పున రెండు పంటలకు రూ.10 వేల చొప్పున పంపిణీ చేస్తున్నది.
ఈ ఏడాది వానకాలం సీజన్లోనూ జిల్లాలోని 3,14,814 మంది రైతులకు రూ. 319. 18కోట్ల సాయాన్ని అందించారు. గత 11 విడుతల్లో జిల్లా రైతాంగానికి పెట్టుబడి సాయం అక్షరాలా రూ.3,337.04కోట్లను అందించి రైతు బంధువుగా రైతుల గుండెల్లో నిలిచారు. మళ్లీ అధికారంలోకి వస్తే మొదటి ఏడాది పెట్టుబడి సాయాన్ని రూ.12వేలకు పెంచి వచ్చే ఐదేండ్లలో రూ.16వేల చొప్పున అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
అయితే రైతుబంధుపై మొదటి నుంచీ కాంగ్రెస్ మాత్రం అక్కసు వెళ్లబోసుకుంటూ వస్తున్నది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కౌలుదారు, భూ యజమానుల్లో ఎవరికో ఒకరికి రైతు బంధు ఇస్తామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంపై జిల్లా లోని రైతులు మండిపడుతు న్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే.. రైతుల బతుకు ఆగమేనని.. సీఎం కేసీఆర్తోనే రైతన్నకు ధీమా అని పేర్కొం టున్నారు.
ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చెబుతున్న ఆరు గ్యారెంటీలన్నీ బూటకమే. రైతుల గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్న రేవంత్రెడ్డికి ఈ ఎన్నికల్లో గుణపాఠం తప్పదు. రైతుబంధు కౌలురైతులకు ఇస్తే భూయజమానికి రాదని చెప్పడం సరికాదు. రైతుబంధుపై ఎన్నికలకు ముందే రేవంత్రెడ్డి మాట మార్చారు. ఆరు గ్యారంటీలు కూడా అధికారంలోకి వస్తే అమలవుతాయన్న నమ్మకమే లేదు. ప్రజలు, రైతులను మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ నాయకులను ఈ ఎన్నికల్లో ఓడిస్తాం. బీఆర్ఎస్కే నా మద్దతు.
-శేఖర్రెడ్డి, గొల్లూరుగూడ, షాబాద్
అమలు కానీ గ్యారెంటీలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు…సచ్చేదిలేదు. మాయమాటలు చెప్పి కర్ణాటకలో అధికారంలోకి వచ్చాక అక్కడ.. ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రైతులు కాంగ్రెస్ చేతిలో మోసపోయేందుకు సిద్ధంగా లేరు. ముచ్చటగా మూడోసారి కూడా కేసీఆర్ సీఎం అవుతారు. ఇచ్చిన మాట ప్రకారం రైతుబంధు పెంపుతోపాటు, మిగతా సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందిస్తారు.
-పీసరి సతీశ్రెడ్డి, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు, షాబాద్
అధికారంలోకి రావాలని అమలు కాని హామీలతో కాంగ్రెస్ ప్రజలను వంచించాలని చూస్తున్నది. మొన్నటివరకు కౌలురైతులు, భూయజమానులకు రైతుబంధు ఇస్తామని చెప్పిన రేవంత్రెడ్డి ఇప్పుడు మాట మార్చారు. ఇద్దరిలో ఒక్కరికే రైతుబంధు ఇస్తామని చెప్పడం దారు ణం. అధికారంలోకి రాక ముందే ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న ఆయన అధికారంలోకి వస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవు. కాంగ్రెస్తో ప్రజలకు మళ్లీ పాత రోజులే వస్తా యి. కాంగ్రెస్ను ఈ ఎన్నికల్లో ఓడించాలి . నా ఓటు రైతన్నలకు మద్దతుగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికే.
-బూడిద నర్సింహారెడ్డి, రైతు నాయకుడు (ఇబ్రహీంపట్నంరూరల్)
కాంగ్రెస్ నాయకుల మాటలతో రైతుల్లో భయం మొదలైంది. కౌలుదారుల కోసం కొత్త చట్టాన్ని తీసుకొచ్చి వారి పేర్లను రికార్డు చేస్తామనడం పట్టాదారుల్లో ఆందోళన కలిగిస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధును భూయజమాని లేదా కౌలుదారుల్లో ఒక్కరికే ఇస్తామనడం సమంజసం కాదు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలతో భూయాజమానులు ఎవ్వరూ తమ భూములను కౌలుకు ఇవ్వరు. గతంలో ఏ యజమాని కూడా కౌలు రైతుతో రాత పూర్వకంగా ఒప్పందం చేసుకోలేదు. కౌలు చేసే వారి పేర్లను భూ రికార్డుల్లో ఎక్కిస్తే భవిష్యత్తులో సమస్యలు వస్తాయి.
-గంప శ్రీనివాస్, కడ్తాల్ మండలం
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు దొంగ హామీలను ఇస్తున్నది. మొన్నటి వరకు రైతుబంధును రైతులు, కౌలుదారులకు కూడా ఇస్తామని చెప్పిన రేవంత్రెడ్డి ఇప్పుడు ఇద్దరిలో ఒక్కరికే ఇస్తామని చెప్పడం ప్రజలను మోసం చేయడమే. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ రైతు వ్యతిరేకే. ఆ పార్టీ నాయకులకు ప్రజలు సంతోషం ఉండడం ఇష్టంలేదు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మళ్లీ పాత రోజులే వస్తాయి. రాష్ట్రంలో రైతులు, ప్రజలు మంచిగా జీవించాలంటే బీఆర్పార్టే అధికారంలోకి రావాలి.
– రవీందర్గౌడ్,మిర్జాగూడ,శంకర్పల్లి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల బతుకులు ఆగం అవుతాయి. రోజుకో మాటతో ప్రజలను కాంగ్రెస్ నాయకులు అయోమయానికి గురి చేస్తున్నారు. రైతుబంధుపై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అని స్పష్టంగా తేలిపోయింది. రైతులు, కౌలుదారుల మధ్య వివాదాలు సృష్టించేలా ఉన్నది. ఈ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ పాత రోజులే వస్తాయి. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నాయకులను ఘోరంగా ఓడించాలి. బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. నా ఓటు సీఎం కేసీఆర్కే .
– నవీన్రెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కౌలు చట్టంతోపాటు కౌలుదారులు, పట్టాదారుల్లో ఒకరికే రైతుబంధును ఇస్తామని చెప్పడంతోపాటు పట్టాదారుల్లో భయాందోళన మొదలైంది. కౌలు చట్టం వస్తే పట్టాదారుడికి, కౌలు రైతులకు మధ్య దూ రం పెరుగడంతోపాటు భూసమస్యలు తలెత్తే ప్రమాదమున్నది. కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చేందుకు పూట కో మాట మాట్లాడుతూ ప్రజల్లో గందరగోళం సృస్టిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే ఆ పార్టీ మ్యానిఫెస్టోలోని హామీలన్నీ బూటకమేనని తెలుస్తున్నది. ఇలాంటి నాయకులు అధికారంలోకి వస్తే రైతులకు అంధకారమే. బీఆర్ఎస్తోనే ప్రజలకు భరోసా.. నా ఓటు ఆ పార్టీకే.
-రూపం వెంకట్రెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు, చింతలపల్లి, ఆమనగల్లు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే దాని నిజ స్వరూపం బయటపడింది. రేవంత్రెడ్డి రైతుబంధుపై చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. తాము అధికారంలోకి వస్తే పట్టాదారులు, కౌలు రైతుల్లో ఒకరికే ఇస్తామని మెలిక పెట్టడాన్ని చూస్తే వారికి రైతులపై ఎలాంటి ప్రేమ లేదని కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బూటకపు హామీలిస్తున్నారని స్పష్టమవుతున్నది.
-వంగేటి లక్ష్మారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం