ప్రభుత్వం మన ఉమ్మడి జిల్ల్లాకు మరో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)ని మంజూరు చేసింది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటికే 18 కేజీబీవీలుండగా.. ప్రస్తుతం చౌడాపూర్ మండలంలో కొత్తగా ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది వరకు 8 కేజీబీవీల్లో ఇంటర్ తరగతులు కొనసాగగా.. ఈ విద్యా సంవత్సరం నుంచే పూడూరు, దౌల్తాబాద్ మండలాల్లోని కేజీబీవీలనూ అప్గ్రేడ్ చేసి ఇంటర్ తరగతులను నిర్వహిస్తున్నది. మరోవైపు రంగారెడ్డి జిల్లాలో మొత్తం 20 కేజీబీవీలుండగా.. ఇప్పటికే 10 విద్యాలయాల్లో ఇంటర్ వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం షాబాద్లోని కేజీబీవీని సైతం ఇంటర్కు అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేజీబీవీల్లో చదువుతున్న బాలికలకు ప్రభుత్వం సకల సౌకర్యాలు, నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందిస్తున్నది.
-షాబాద్, ఆగస్టు 31
బొంరాస్పేట , ఆగస్టు 31 : వికారాబాద్ జిల్లాకు ప్రభుత్వం కొత్తగా ఒక కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)ను మంజూరు చేసింది. జిల్లాలో కొత్తగా ఏర్పాటైన చౌడాపూర్ మండలానికి దీనిని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా మంజూరైన కేజీబీవీతో కలిపి జిల్లాలో కేజీబీవీల సంఖ్య 19కి చేరింది. అలాగే జిల్లాలో ఇంత వరకు 8 కేజీబీవీలలో ఇంటర్ తరగతులు కొనసాగుతుండగా ఈ విద్యా సంవత్సరం నుంచి పూడూరు, దౌల్తాబాద్ మండలాల్లో కూడా కేజీబీవీలను అప్గ్రేడ్ చేసి ఇంటర్ తరగతులను ప్రారంభించింది. కొత్తగా మంజూరు చేసిన కేజీబీవీని త్వరలో ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని కేజీబీవీలలో 4,996 మంది బాలికలు చదువుకుంటుండగా వారికి ప్రభుత్వం అన్ని రకా ల వసతి సౌకర్యాలను కల్పిస్తూ నాణ్యమైన విద్య ను అందిస్తున్నది. బాలికలకు భద్రత తో పాటు మంచి విద్య అందుతుండడంతో కేజీబీవీలలో తమ పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు ఉత్సాహం చూపుతున్నారు.
వికారాబాద్ జిల్లాలో..
వికారాబాద్ జిల్లాలోని బొంరాస్పేట, కొడంగల్, దౌల్తాబాద్, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్, వికారాబాద్, మోమిన్పేట, బంట్వారం, కోట్పల్లి, ధారూరు, మర్పల్లి, నవాబ్పేట, పరిగి, కులకచర్ల, పూడూరు, దోమ మం డలాల్లో కేజీబీవీలు ఉన్నాయి. కొత్తగా ఏ ర్పాటైన పరిగి నియోజకవర్గంలోని చౌడాపూర్ మండలానికి ప్రభుత్వం నూతనంగా కేజీబీవీని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా మంజూరైన కేజీబీవీతో జిల్లాలో కేజీబీవీల సంఖ్య 19కు చేరింది. గతేడాది కొత్తగా ఏర్పడిన దుద్యాల మం డలానికి కేజీబీవీ రావా ల్సి ఉంది. జిల్లాలో ప్రస్తుతమున్న 18 కేజీబీవీల్లో 4,996 మంది బాలికలు చదువుకుంటున్నారు.
కేజీబీవీలలో నాణ్యమైన విద్య
బాలికా విద్యను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను ఏర్పా టు చేసింది. వీటిలో ఆరో తరగతి నుంచి విద్యార్థినులను చేర్చుకుంటారు. ఒక్కో కేజీబీవీలో 10వ తరగతి వరకైతే 200 మందికి, ఇంటర్ వరకైతే 360 మందికి ప్రవేశాలు కల్పిస్తారు. అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఉచిత విద్యతో పాటు బాలికలకు ఏడాదిలో రెండు జతల యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, బెడ్షీట్లు, దుప్ప ట్లు, హైజీన్ కిట్స్, కాస్మోటిక్స్ తదితర వాటిని ఉచితంగా అందజేస్తున్నారు. ప్రతిరోజూ బాలికలకు నాణ్యమైన పోషకాహారాన్ని అందిస్తున్నారు. వారంలో రెండు రోజులు మటన్, చికెన్ అందిస్తున్నారు. పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లను ఏర్పా టు చేసి విద్యార్థినులకు మినరల్ వాటర్ను సరఫరా చేస్తున్నా రు. చలికాలంలో స్నానాలు చేయడానికి వేడినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ప్రతి పాఠశాలలో వాటర్ హీటర్లను ఏర్పాటు చేశారు. బాలికలకు విద్యతో పాటు చేతి వృత్తులలో కూడా ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నారు.
10 కేజీబీవీలలో ఇంటర్ తరగతులు
జిల్లాలోని 10 కేజీబీవీలలో ఇంటర్ తరగతులను కొనసాగిస్తున్నారు. కొడంగల్, పెద్దేముల్, కులకచర్ల, వికారాబాద్, దోమ, యాలాల మండలాల్లోని కేజీబీవీలు ఇంటర్ వరకు ఉండగా ఈ వి ద్యా సంవత్సరం నుంచి దౌల్తాబాద్, పూడూరు మండలాల్లోని కేజీబీవీలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేసి మొదటి సంవత్సరం తరగతులు ప్రా రంభించారు. పది కేజీబీవీలలో ఎంపీసీ, బైపీసీ కోర్సులు ఉండగా కొన్నిచోట్ల సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులను ప్రారంభించారు. కేజీబీవీలలో బాలికలకు మంచి విద్యతో పాటు భద్రత కూడా ఉంటుండడంతో తల్లిదండ్రులు వీటిలో చేర్పించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో మరొకటి అప్గ్రేడ్…!
షాబాద్, ఆగస్టు 31: రాష్ట్ర ప్రభుత్వం సర్కారు విద్యను మరింత బలోపేతం చేస్తున్నది. కేజీబీవీ పాఠశాలలను కళాశాలలుగా అప్గ్రేడ్ చేసింది. ఇప్పటివరకు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థినులు అక్కడే ఇంటర్ విద్య కూడా పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. పాఠశాలలను కళాశాలలుగా అప్గ్రేడ్ చేసింది. విద్యార్థినులకు కావాల్సిన కోర్సులతో పాటు ఉపాధి కోర్సులను ప్రవేశపెడుతూ బాలికా విద్యకు భరోసా కల్పిస్తున్నది. చదువుతో పాటు, ఉపాధి ఉద్యోగ అ వకాశాలను కల్పించే కోర్సులను ప్రవేశపెడుతున్నది. విద్యార్థుల బంగారు భవిష్యత్కు అండగా నిలుస్తున్నది. ఒకప్పుడు డ్రాప్ అవుట్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కేజీబీవీలు ప్రస్తుతం కళాశాలలుగా మారడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది వరకు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పది కేజీబీవీలు ఇంటర్ వరకు అప్గ్రేడ్ కాగా, తాజా గా ఈ ఏడాది షాబాద్ కేజీబీవీని కళాశాలగా అప్గ్రేడ్ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సం వత్సరం (2023-24) నుంచే ఇంటర్ ఫస్టియర్ తరగతులు ప్రారంభం కాగా, 2024-25లో సెకండియర్ తరగతులు ప్రారంభం కానున్నాయి.
జిల్లాలో 20 కేజీబీవీ పాఠశాలలు
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఆమనగల్లు (కల్వకుర్తి), రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 20 కేజీబీవీ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 11 పా ఠశాలలు కళాశాలలుగా అప్గ్రేడ్ అవ్వడంతో ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు చదువుకు నే అవకాశం కల్పించారు. అన్ని పాఠశాలల్లో కలి పి మొత్తం సుమారు 5,200 మంది వరకు బా లికలు విద్యనభ్యసిస్తున్నారు. కేజీబీవీల్లో పేద వి ద్యార్థులే అధికంగా చదువుకుంటుండగా… ప్ర భుత్వం ఉచిత విద్యతో పాటు వసతి, భోజనం, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నది. నూతనంగా అప్గ్రేడ్ అయిన కళాశాలల్లో సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సుల్లో 40 సీట్ల చొప్పున కేటాయించారు. గత నెలలో విద్యార్థుల నుంచి అడ్మిషన్ల కు దరఖాస్తులు స్వీకరించిన అధికారులు… ప్ర స్తుతం తరగతులు నిర్వహిస్తున్నారు. పేద విద్యార్థులకు కేజీబీవీల్లో ఇంటర్ వరకు చదివే అవకాశం కల్పించడం సంతోషకరమని విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
11కేజీబీవీల్లో ఇంటర్ తరగతులు
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 20 కేజీబీవీ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఇ ప్పటివరకు 10 కేజీబీవీలు ఇంటర్ వరకు అప్గ్రేడ్ అ య్యాయి. తాజాగా ఈ ఏడాది మరొకటి షా బాద్ కేజీబీవీని కూడా ప్రభుత్వం ఇంటర్ క ళాశాలగా అప్గ్రేడ్ చేసింది. దీంతో కళాశాలలుగా మారిన కేజీబీవీల సంఖ్య 11కి చేరుకున్నది. ప్రతి ఏడాది ఒకటి, రెండు కళాశాలలను ప్రభుత్వం అప్గ్రేడ్ చేయడంతో అప్గ్రేడ్ అ యిన కళాశాలల్లో సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సుల్లో 40 సీట్ల చొప్పున కేటాయించారు. ప్రస్తుతం కళాశాలల్లో విద్యార్థినులకు ఇంటర్ తరగతులు నిర్వహిస్తున్నాం.
– సుజాత, కేజీబీవీ పాఠశాలల రంగారెడ్డిజిల్లా అధికారి