కొడంగల్ : పట్టణంలోని జులైవాడలో వెలసిన చౌడేశ్వరీ అమ్మవారి పుట్టిన రోజు వేడుకలను తోగుటవీరక్షత్రీయ సేవా సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం అమ్మవారి వేడుకను పురస్కరించుకొని అమ్మవారికి భక్తులు అభిశేకం చేయించారు. ఆదివారం అమావాస్య కలిసి రావడంతో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో కొలువుదీర్చి పట్టణ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి వేంకటేశ్వరస్వామి దేవాలయ సమీపంలోని అమ్మవారి భక్తుడు డప్ప ఇంటి వద్దకు తరలివెళ్లారు. అనవాయితీ ప్రకారం అమ్మవారికి పుట్టిన ఇల్లుగా భావించిన భక్తులు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊరేగింపులో తొగుటవీరక్షత్రీయులు అమ్మవారి భక్తులు ఖడ్గాలను వల్లెవేస్తు అమ్మవారికి స్థుతించుకున్నారు.
అనంతరం సాయంత్రం అమ్మవారికి దోలారోహన కార్యక్రమాన్ని చేపట్టారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉయ్యాలలో కొలువుదీర్చి మహిళలు అమ్మవారి భక్తి కీర్తనలను ఆలపించారు. సాయంత్ర 7 గంటల నుంచి దాదాపు మూడు గంటలకు పాటు డోలారోహణ కార్యక్రమం అత్యంత రమణీయంగా కొనసాగింది. కార్యక్రమంలో తొగుటవీరక్షత్రీయ సేవా సంఘం అధ్యక్షుడు దేవరకొండ చిన్నరాములు, ప్రధాన కార్యదర్శి శంకర్, సభ్యులు దేవరకొండ శ్రీనివాస్, హకీం బాల్రాజ్, దేవరకొండ రమేశ్, గురం ఆనంద, వెంకటేష్ పాల్గొన్నారు.