మొయినాబాద్ : చిలుకూరు బాలాజీ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనీల్యాదవ్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం ఆయన ఆలయానికి విచ్చేసి స్వామి వారిని దర్శించుకునే ముందు ఆలయం గర్బగుడి చుట్టు ప్రదక్షణలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రంగరాజన్ ప్రత్యేక పూజలు నిర్వహించగా మంత్రి అనీల్యాదవ్ పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న సుందరేశ్వరస్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వారికి మొయినాబాద్ పోలీస్ స్టేసన్ సీఐ రాజు బందోబస్తు నిర్వహించారు.