షాద్నగర్టౌన్ : తల్లిపాలు పిల్లలకు దివ్య ఔషధం వంటివని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. షాద్నగర్ సీడీపీఓ నాగమణి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిపాలతోనే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. మొదటి 6నెలల పాటు పసిపాపలకు తల్లిపాలు ఇవ్వాలని, తల్లిపాల ద్వారా వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుందన్నారు.
తల్లిబిడ్డల ఆరోగ్యమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తుందన్నారు. అదే విధంగా ప్రభుత్వ దవాఖానలో ప్రసవించిన గర్భిణులకు ఆడబిడ్డ పుడితే రూ. 13వేలు, మగబిడ్డ పుడితే 12వేలు ఇవ్వడంతో పాటు కేసీఆర్ కిట్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కార్ అని గుర్తు చేశారు. పలువురు బాలింతలను శాలువలతో ఘనంగా సత్కారించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, జడ్పీటీసీలు వెంకట్రాంరెడ్డి, విశాల, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ ఆహ్మాద్, కౌన్సిలర్లు బచ్చలి నర్సింహులు, ప్రతాప్రెడ్డి, శ్రీనివాస్, చంద్రకళ, శ్రావణి, నాయకులు యుగేందర్, యాదగిరి, లక్ష్మణ్నాయక్, నందకిషోర్, అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.