హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన వీరుడు ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పల్లెపల్లెనా, మండల కేంద్రాలు, పట్టణాల్లో యువకులు పెద్ద ఎత్తున ర్యాలీలు తీశారు. జై శివాజీ…జైజై శివాజీ, భారత మాతాకీ జై, భవానీ మాతాకు జై అంటూ నినాదాలు చేశారు. పార్టీలు, కులమతాలకు అతీతంగా శివాజీ ఉత్సవ విగ్రహాలతో భారీ శోభాయాత్రలను నిర్వహించారు.
షాబాద్, ఫిబ్రవరి 19: మండలంలో ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆదివారం మండలంలోని నాగరగూడ, షాబాద్ గ్రామాల్లో యువకులు ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బైకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, బజరంగ్దళ్ కార్యకర్తలు, యువకులు, తదితరులున్నారు.
యువతకు స్ఫూర్తి ఛత్రపతి శివాజీ
షాద్నగర్టౌన్ : ఛత్రపతి శివాజీని నేటితరం యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకుసాగాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నాయకుడు బండారి రమేశ్ అన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా షాద్నగర్ మున్సిపాలిటీ కాలేజీ రోడ్డులోని శివాజీ విగ్రహం వద్ద హిందూ వాహిని, అరె కటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బైకు ర్యాలీని ప్రారంభించారు. అదే విధంగా శివాజీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే శంకర్రావు, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో చెట్ల వెంకటేశ్, శేఖర్గౌడ్, కుమార్, మోహన్, మధు, సతీశ్,
శ్రావణ్, రాజు, మహేశ్, శంకర్ పాల్గొన్నారు.
తుర్కయాంజాల్ : తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి కొహెడ చౌరస్తాలో మండల రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ కందాళ బలదేవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆమనగల్లు : బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. శివాజీ విగ్రహానికి పూలమాలలేసి జడ్పీటీసీ అనురాధ స్థానిక నాయకులతో కలిసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కడ్తాల్ జడ్పీటీసీ దశరథ్ నాయక్, పోలేపల్లి ఎంపీటీసీ దోనాదుల కుమార్, నాయకులు నిరంజన్ గౌడ్, ఉప్పల రాములు, వస్పుల సాయిలు, గుత్తి బాలస్వామి, ఎంగలి రఘు, జయరాం, జంగయ్య, వెంకటేశ్, జంతుక కిరణ్, కంబాలపల్లి అల్లాజీ పాల్గొన్నారు.
నందిగామ : మండల కేంద్రంలో శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో శివాజీ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ జిల్లెల వెంకట్రెడ్డి, నాయకులు రవికుమార్, శ్రీనివాస్, బంటు, యాదయ్య, ప్రవీణ్రెడ్డి, శివ, వెంకటేశ్, శ్రీహరి, రహీం పాల్గొన్నారు.
కేశంపేట : మండలంలోని పాపిరెడ్డిగూడలో ఆదివారం రాజకీయ పార్టీలకు అతీతంగా శివాజీ చిత్రపటంతో ర్యాలీ నిర్వహించారు. శివాజీ పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. మండల వ్యాప్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్లు విష్ణువర్ధన్రెడ్డి, సర్పంచ్ అంజయ్య, నాయకులు రఘురాములుగౌడ్, సుందరయ్య, దేవేందర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ ఆధ్వర్యంలో..
పెద్దఅంబర్పేట : ఛత్రపతి శివాజీ లౌకికవాది అని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవీంద్రాచారి అన్నారు. రావినారాయణరెడ్డి కాలనీలోని పార్టీ కార్యాలయంలో కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్ ఆధ్వర్యంలో శివాజీ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల యాదిరెడ్డి, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు సామిడి శేఖర్రెడ్డి, ఏఐటీయూసీ మండల కార్యదర్శి హరిసింగ్ నాయక్, నాయకులు వేణుగోపాలాచారి, కేతరాజు నరసింహ, శేఖర్, అరుణ, ప్రసాద్ పాల్గొన్నారు.
యాచారం : మండలంలోని నల్లవెల్లిలో ఓంయూత్ ఆధ్వర్యంలో శివాజీ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. శివాజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ డేరంగుల రాజు, ఉపసర్పంచ్ వినోద్, శేఖర్, యాదగిరి తదితరులున్నారు.
శంకర్పల్లి : ఛత్రపతి శివాజీ జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు మాచన్న గారి రాఘవేందర్రెడ్డి అన్నారు. మహాలింగాపురం గ్రామంలోని శివాజీ విగ్రహం వద్ద పూల మాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా మండలంలోని ప్రొద్దటూర్ గ్రామంలో యువకులు బైకు ర్యాలీ నిర్వహించారు.
శివాజీ విగ్రహావిష్కరణ
మొయినాబాద్ : హిమాయత్నగర్ గ్రామంలో శివాజీ విగ్రహాన్ని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు సీఎస్ రంగరాజన్, సీఐ డీకే లక్ష్మీరెడ్డి , సర్పంచ్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎం మంజుల ఆవిష్కరించారు. కేతిరెడ్డిపల్లి గేటు వద్ద ఉన్న శివాజీ విగ్రహం వరకు వివిధ గ్రామాల యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడ మరాఠ సంఘం ఆధ్వర్యంలో జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో కనకమామిడి సర్పంచ్ జనార్దన్రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు గణేశ్రెడ్డి, యువకులు పాల్గొన్నారు.