షాబాద్ : పోడు భూములపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం పోడు భూములపై జిల్లా కలెక్టర్లు, అటవీశాఖ అధికారులతో సీఎస్ సోమేశ్కుమార్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ, డివిజన్, జిల్లా స్థాయిలో టీంలను ఏర్పాటు చేసి అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడలన్నారు. వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో అఖిలపక్ష సమావేశం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగిందని తెలిపారు.
తమ సూచనల మేరకు ముందుకు వెళ్తామని కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా అటవీశాఖ అధికారి జానకీరామ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.