చేవెళ్లటౌన్, జనవరి 26 : పెండింగ్లో ఉన్న మినీ స్టేడియం పనులు త్వరలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. గురువారం చేవెళ్లలోని మిని స్టేడియం, నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మినీ స్టేడియం, వాకింగ్ ట్రాక్ను సొంత నిధులతో పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. మినీ స్డేడియం నిర్మాణాన్ని వచ్చి చూసి పోవుడే అవుతుందే తప్ప.. పనులు మాత్రం చేయడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని.. రెండు, మూడు రోజుల్లో పనులు మొదలు పెట్టాలని కాంట్రాక్టర్తో ఫోన్లో మాట్లాడి చెప్పారు. సోమవారం కల్లా పనులు మొదలు పెట్టాలని కాంట్రాక్టర్కు సూచించారు. అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరిశీలించి, పనులెందుకు ఆగిపోయాయి.. వెంటనే పనులు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థులు చదువుతోపాటు క్రీడారంగంలోనూ రాణించాలి
విద్యార్థులు చదువుతోపాటు క్రీడారంగంలోనూ రాణిస్తే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య తెలిపారు. చేవెళ్లలోని మహేందర్రెడ్డి మెడికల్ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రీడా మైదానం (ప్రాంగణం), గర్ల్స్ హాస్టల్ను గురువారం వారు ప్రారంభించారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల కార్యదర్శి సంతోష్రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ జోయరాణి, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వర్రావు, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట రంగారెడ్డి, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, సర్పంచ్ మోహన్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాణిక్యరెడ్డి, డైరెక్టర్లు వెంకటేశ్, సాయికుమార్, సీనియర్ నాయకుడు కృష్ణారెడ్డి, నాయకులు సత్యం, రాముప్రసాద్ పాల్గొన్నారు.