నవాబుపేట, సెప్టెంబర్ 23 : ఆరోగ్యమే మహాభాగ్యమని, మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధిస్తాడని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి తన సొంత నిధులతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేవెళ్ల ఆరోగ్య రథం సేవలను శనివారం అర్కతల గ్రామంలో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని ఇంటి ముందుకే తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. ఆరోగ్య సమస్య లు ఉన్న వారందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మం డల అధ్యక్షుడు దయాకర్రెడ్డి, సర్పంచులు సుధాకర్రెడ్డి, రత్నం, వెంకట్రెడ్డి, పర్మయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగిరెడ్డి, నాయకులు రంగారెడ్డి, ఆనంద్రెడ్డి, ప్రభాకర్, మల్లారెడ్డి, ఎంపీడీవో సుమిత్రమ్మ పాల్గొన్నారు.
మహిళలకు పింఛన్లు ఎంతో భరోసా
వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు అందజేస్తు న్న పింఛన్లు వారికి ఎంతో భరోసాను ఇస్తున్నాయని ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. ఆసరా పింఛన్లు తీసుకునే వారు మృతి చెందగా వారికి సంబంధించి అర్హులైన వారికి మండల పరిధిలోని ప్రజా పరిషత్తు కార్యాలయం సమావేశం మందిరంలో శనివారం పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆసరా పింఛన్ల పథకాన్ని అమలుజేస్తున్నట్లు గుర్తుజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.