చాదర్ఘాట్, డిసెంబర్ 28 : హాష్ ఆయిల్ ను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను చాదర్ఘాట్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దాదాపు రూ.4లక్షలు విలువ చేసే కిలో హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. చాదర్ఘాట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలను బుధవారం విలేకరుల సమావేశంలో ఏసీపీ వెంకటరమణ, చాదర్ఘాట్ ఇన్స్పెక్టర్ ప్రకాశ్రెడ్డి వెల్లడించారు. జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధితో జగద్గిరిగుట్టకు చెందిన సందీప్గౌడ్(25), వినయ్కమార్రెడ్డిలు గంజాయి హాష్ ఆయిల్ విక్రయాలు చేపట్టారు.
మల్కాజ్గిరికి చెందిన పాత నేరస్తుడు పృథ్వీరాజ్ను సంప్రదించారు. దీంతో అరకుకు చెందిన కృష్ణకు రూ.70 వేల నగదును ఇచ్చి పృథ్వీరాజ్ కిలో హాష్ ఆయిల్ను నగరానికి తీసుకొచ్చాడు. మలక్పేట నల్గొండ చౌరస్తా వద్ద సందీప్గౌడ్, వినయ్కుమార్రెడ్డిలకు పృథ్వీరాజ్ అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.4లక్షల విలువ గల కిలో హాష్ ఆయిల్, 3 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.