మోమిన్పేట : మండల పరిధిలోని చన్నకొల్కుంద గ్రామంలో శుక్రవారం స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ కేంద్ర బృందం టీం గ్రామంలో పర్యటించి ప్రారిశుధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవడంతో పాటు వాడుకుంటూ బహిరంగా మలవిసర్జన నిషేధించాలన్నారు. ఇంట్లో నుంచి మురికినీరు రోడ్లుపైకి రాకుండా ఇంటింటికీ ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలన్నారు. తడి, పోడి చెత్త వేరు చేసి పంచాయతీ ట్రాక్టర్లో వేయాలని సూచించారు. పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ఆరోగ్య కేంద్రం, గ్రామ పంచాయతీ, దేవాలయలు, మసీదులు ప్రార్థన స్థలాలు, సాముహిక ప్రదేశాల్లో పారిశుధ్య వసతుల్లో నిర్లక్ష్యం వహించారదని తెలిపారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ పారిశుధ్య నిర్వహనపై గుణాత్మకమైన పరిశీలన సర్వే నిర్వహించి పారిశుధ్యంపై గ్రామాలకు ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో స్వచ్ఛ సర్వేక్షన్ కేంద్రబృందం పరిశీలకులు రఘు, ప్రసాద్, ఎంపీడీవో శైలజా రెడ్డి, ఎంపీవో యాదగిరి, ఏపీవో శంకర్, సర్పంచ్, సురేష్ ఉన్నారు.