న్యూ ఇయర్ వేడుకలు జిల్లాలో జోరుగా సాగాయి. బైక్ల హోరు.. రోడ్లపై యువత జోష్ కొనసాగింది. ఇండ్ల ముంగిట ఆడపడుచులు రంగ వల్లులు వేసి కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ఇంటింటా న్యూ ఇయర్ వేడుకల కాంతులు విరజిమ్మాయి. అవుట్డోర్ పార్టీలు.. డీజేల మోతలు యువతను ఉర్రూతలూగించాయి. గెస్ట్ హౌస్లు, రిసార్టులు, పార్కులు, క్లబ్లు, స్టార్ హోటల్స్, కన్వెన్షన్లలో సంబురాలు అంబరాన్నంటిన వేళ.. న్యూ ఇయర్ 2024ను ఆహ్వానించారు.
వైన్స్ దుకాణాలు, మాంసం, మద్యం, బేకరీలు, హోటళ్లు కిటకిటలాడాయి. అక్కడక్కడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా వేడుకలు ప్రశాంతంగా జరుగడంతో పోలీస్శాఖ సైతం ఊపిరిపీల్చుకున్నది. సోమవారం కూడా సెలవు దినం కావడంతో చాలా మంది ఇంట్లోనే, కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలను జరుపుకొంటే.. మరికొందరు దగ్గరలోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేశారు. వివిధ ప్రాంతాల్లో ఆలయాలకు సైతం భక్తులు పోటెత్తారు.
– రంగారెడ్డి, జనవరి 1 (నమస్తే తెలంగాణ)
మొయినాబాద్, జనవరి 1 : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మండలంలోని చిలుకూరు బాలాజీ ఆల యం భక్తులతో జనసంద్రంగా మారింది. కొత్త ఏడాదిలో అనుకున్న కోర్కెలు, లక్ష్యాలను నెరవేర్చాలని సోమవారం ఉదయం ఐదు గంటల నుంచే స్వామివారి దర్శనానికి భారీ గా పోటెత్తారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఉదయం 5 గంటల నుంచి దర్శనానికి అనుమతించారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా క్యూలైన్లను ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. భక్తుల తాకిడి ఉదయం 12 గంటల వరకు అంతంత మా త్రంగానే ఉండగా.. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో తరలివచ్చా రు.
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గర్భగుడి చుట్టూ ప్రతిరోజూ చేసే ప్రదక్షిణలను నిర్వాహకులు నిలిపేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు సొంత వాహనాలల్లో తరలిరావడంతో ప్రత్యేక పార్కింగ్ను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగింది. భక్తులు హైదరాబాద్ నగరం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల నుంచి కూడా వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణం లో ఉన్న సుందరేశ్వరస్వామిని కూడా దర్శించుకున్నారు. చిలుకూరు శ్రీవారిని సుమారుగా 40 వేల నుంచి 50 వేల మంది దర్శించుకున్నారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
నూతన ఏడాది రోజున భగవంతుడిని దర్శించుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో భక్తులు సోమవారం కనకమామిడి గ్రామంలో ఉన్న సంఘమేశ్వర(శివాలయం) ఆలయానికి అధికంగా తరలివచ్చారు. సాధారణంగా ప్రతి సోమవారం శివుడిని దర్శించునేందుకు భక్తులు వస్తుంటా రు. కానీ నూతన సంవత్సరం.. సోమవారం రెండు కలిసి రావడంతో భక్తులు అధికంగా వచ్చి పరమశివుడిని దర్శించుకున్నారు. అర కిలోమీటరు దూరం వరకు భక్తులు క్యూలో నిలుచున్నారు. అదేవిధంగా గ్రామంలోనే కొలువైన వేంకటేశ్వరస్వామిని కూడా భక్తులు దర్శించుకున్నారు.
రంగారెడ్డి, జనవరి 1 (నమస్తే తెలంగాణ): జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలు ధూంధాంగా జరిగాయి. రాత్రి అంతా సందడిగా సాగిం ది. స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యుల నడుమ ఎవరి స్థాయిలో వారు వేడుకలను ఘనంగా నిర్వహించారు. గెస్ట్హౌస్ లు, రిసార్టులు, పార్కులు, క్లబ్లు, స్టార్ హోటళ్లు, కన్వెన్షన్లలో వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో వేడుకలు ప్రతి ఒక్కరినీ అలరింపజేశాయి. లైవ్మ్యూజిక్కు అనుగుణంగా కుర్రకారు డ్యా న్స్లతో హోరెత్తించింది. మరికొన్ని చోట్ల కుటుంబ సభ్యులంతా ఒకేచోట కూర్చుని వేడుకలను ఆస్వాదించారు. కొంతమంది ఇం ట్లోనే విందు, వినోదాలు చేసుకోవడంతో వైన్స్ దుకాణాలు, నాన్ వెజ్ దుకాణాల వద్ద సందడి నెలకొన్నది. హోటళ్లలో బిర్యానీ పార్సిళ్లకు కొత్త సంవత్సరం వేళ ఫుల్ గిరాకీ ఉండడంతో నిర్వాహకులు రేట్లను భారీగా పెంచారు. కొవిడ్ కొత్త వేరియంట్ భయాలున్నప్పటికీ ప్రజానీకం ఏమాత్రం వెనుకడుగు వేయలేదు.
నూతన సంవత్సరం వేళ సోమవారం..ఆలయాలు కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. వరుసగా రెం డు రోజులు సెలవులు రావడం వేడుకలకు కలిసొచ్చింది. ముందే ప్లాన్ చేసుకుని దూర ప్రాంతాలకు వెళ్లి న్యూ ఇయర్ వేడుకలను జరుపుకొన్నారు. ఆదివారం రాత్రి వేడుకలను బయట జరుపుకొ న్నా సోమవారం మాత్రం అంతా ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపారు. కొందరు ఆలయాలను సందర్శించి కొత్త ఏడాదిలో అనుకున్న లక్ష్యాలను సాధించాలని వేడుకున్నారు. మరికొందరు దగ్గరిలోని పర్యాటక ప్రాంతాలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. ఒకరినొకరు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. వాట్సాప్, ట్విటర్, ఇన్స్ట్రాగ్రామ్లలో శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. ప్రజా ప్రతినిధులు, ఉన్నతస్థాయి అధికారులకు ఉద్యోగులు, ప్రజ లు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
గతేడాది కొందరికీ మధుర జ్ఞాపకాలు, మరికొందరికీ చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. నూతన సంవత్సరం అన్ని విధాలా అనుకూలంగా ఉం టుందని అని వర్గా ల ప్రజలు ఆశాభావంతో ఉన్నాయి. కరోనా సంక్షో భం సమిసిపోయి కొత్త ఏడాదిలో విద్యారంగంతోపాటు, వర్తక, వ్యా పార, వాణిజ్య, నిర్మాణ రంగాలకు తిరుగు ఉండదన్న ఆత్మవిశ్వాసాన్ని ఆయా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అన్నదాతలతోపాటు.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ఉద్యోగులు, వివిధ వర్గాల వారు నూతన సంవత్సరంలో సానుకూల పరిస్థితులు నెలకొని మునుపటిలా సాఫీగా సాగుతుందని ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేస్తున్నారు.