కడ్తాల్ : రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తుల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని సర్పంచ్ లక్ష్మినర్సింహారెడ్డి నాయీబ్రాహ్మణులు, రజక సంఘం సభ్యులతో కలిసి లబ్ధిదారులకు దరఖాస్తులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం కుల వృత్తులను అన్ని విధాల ఆదుకుంటున్నారన్నారు. దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులకు పంపిస్తామని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు భిక్షపతి, గణేష్గౌడ్, పంచాయతీ కార్యదర్శులు రాంచంద్రారెడ్డి, హరీశ్రెడ్డి పాల్గొన్నారు.