కందుకూరు, ఏప్రిల్ 28 : కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ చేవెళ్ల గడ్డపై విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం మాదాపూరు, కొలను గూడ, గ్రామాల్లో ఇంటింటికీ ప్రచారం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవెరశెట్టి చంద్రశేఖర్, సీనియర్ నాయకులు గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలుక మేఘనాథ్రెడ్డి, తాళ్ల కార్తీక్, బర్కం వెంకటేశ్, గుయ్యని సామయ్య, మాజీ సర్పంచ్ జంగారెడ్డి, సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు.