గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ ఊరూరా డప్పుచప్పుళ్లతో అభ్యర్థులకు ఘన స్వాగతం లభిస్తున్నది. బోనాలు, బతుకమ్మలతో మహిళలు నీరాజనం పడుతుండగా, ఎడ్లబండ్లు, బైక్ ర్యాలీలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. స్వచ్ఛందంగా వేలాదిగా తరలివస్తున్న మహిళలు, యువతీయువకులు, పార్టీ శ్రేణులు ‘జై తెలంగాణ, జైజై కేసీఆర్, కారు గుర్తుకే మన ఓటు’ అంటూ పల్లెలు ప్రతిధ్వనించేలా నినాదాలు చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రచార అస్ర్తాలుగా బీఆర్ఎస్ అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు.
సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా రూపొందించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను గడపగడపకూ వెళ్లి వివరిస్తున్నారు. పింఛన్లు రూ.6016లకు పెంపు, ఆరోగ్య రక్ష రూ.15 లక్షలకు పెంపు, రైతుబంధు సాయం రూ.16 వేలు, రూ.400లకే వంట గ్యాస్ సిలిండర్ వంటి మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు అర్థమయ్యేలా తెలియజేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల సమక్షంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతుండడంతో మరింత బలం, బలగం పెరుగుతున్నది.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
చేవెళ్లటౌన్, అక్టోబర్ 19 : మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని, సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోతో ప్రతిపక్ష పార్టీల్లో వణుకు మెదలైందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం చేవెళ్ల గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్లి వృద్ధులను కలిసి పింఛన్లు వస్తున్నాయా? లేదా? తదితర విషయాలను తెలు సుకున్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గ్రామంలో చేపట్టిన వివి ధ అభివృద్ధి పనులను వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందన్నారు. కాంగెస్ ఆరు గ్యారంటీలు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో కొట్టుకుపోయాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
చేవెళ్ల గ్రామానికి చెందిన దండు మల్లమ్మ భర్త పెంటయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి యాదయ్యకు ఎన్నికల ఖర్చు కోసం రూ.51,116ల చెక్కును విరాళంగా ప్రచారంలో అందజేశారు. దీంతో దండు మల్లమ్మ, పెంటయ్యలను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో చేవెళ్ల డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణా రెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, మాజీ ఎంపీపీ బాల్రాజ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకటరంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహులు, ముడిమ్యాల పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎర్ర మల్లేశ్, సర్పంచ్లు మాణిక్య రెడ్డి, శంకర్, డైరెక్టర్లు పామెన వెంకటేశ్, కృష్ణ, ఫయాజ్, సాయినాథ్, నాయకులు కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి, సత్తి, సాయి కుమార్రెడ్డి, శేఖర్, నరేందర్ పాల్గొన్నారు.
షాద్నగర్ : ఎన్నికల ప్రచారంలో కారు జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నది. ఎన్నికల హామీలు, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి వంటి అంశాలను ఓటర్లకు వివరిస్తూ తమ దైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. గురువారం షాద్నగర్ మున్సిపాలిటీలోని రతన్ కాలనీ, పటేల్ రోడ్డు, వినాయక గంజ్, నెహ్రూనగర్, చటాన్పల్లి, రాంనగర్ కాలనీలో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించి కారు గుర్తు ఓటు వేయాలని కోరారు.
సీఎం కేసీఆర్ సంపూర్ణ సహకారంతో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని వివరించారు. షాద్నగర్ పట్టణంలోని మెయిన్ రోడ్డు అభివృద్ధి, ఎల్ఈడీ విద్యుత్ దీపాల ఏర్పాటు, అన్ని కాలనీల్లో అంతర్గత మురుగు కాలువల ఏర్పాటు, సీసీ రోడ్ల నిర్మాణాలు, వన నర్సరీలు, పారిశుధ్య నిర్వహణకు వాహనాల ఏర్పాటు, ఇంటింటికీ మంచి నీటి సౌకర్యం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని తెలిపారు. అభివృద్ధిని చూసి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ను ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు విశ్వం, కౌన్సిలర్లు జీటీ శ్రీనివాసులు, వెంకట్రాంరెడ్డి, ప్రతాప్రెడ్డి, బచ్చలి నర్సింహ, సర్వర్ పాషా, ఈశ్వర్కాలనీ రాజు, నాయకులు చీపిరి రవియాదవ్, పినమోని గోపాల్, అశోక్యాదవ్, చెన్నయ్య, ఆయా కాలనీల వాసులు
నందిగామ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థ్ధి అంజయ్యయాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని నాయకులు కోరారు. వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీకి అపూర్వ స్పందన వస్తున్నదని, ఎమ్మెల్యే భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని వారు అన్నారు.
నందిగామ : షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందాలని నందిగామ పీఏసీఎస్ డైరెక్టర్ రాంబాబు కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా లోని బందే నవాజ్ దర్గాలో గురువారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
మొయినాబాద్ : పేద ప్రజలకు కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓటు అడగాలని జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డి మహేందర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని అజీజ్నగర్ గ్రామంలో ఎన్నికలకు సమాయత్తం అవ్వడానికి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మేలు కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదన్నారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు పడ్డ కష్టాలను మరువరన్నారు. అభ్యర్థి గెలుపు కోసం అందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు జయవంత్, సుధాకర్యాదవ్, ప్రధాన కార్యదర్శి నర్సింహాగౌడ్, మాజీ ఎంపీటీసీ మాణిక్రెడ్డి, వార్డు సభ్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, అజీజ్నగర్ గ్రామ అధ్యక్షుడు డేవిడ్, చిలుకూరు గ్రామ అధ్యక్షుడు రాంచందర్, బాకారం గ్రామ కమిటీ అధ్యక్షుడు నర్సింహ, వార్డు సభ్యుడు వెంకటేశ్, నాయకులు సునీల్కుమార్, రవియాదవ్, శ్రీశైలం, దర్గ రాజు, మాణిక్యం, చెన్నారెడ్డి, యాదగిరిచారి, షాబాద్ దర్శన్, మిట్టు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.