తాండూరు : తాండూరు పట్టణంలోని మరిచెట్టు కూడలిలో వెలసిన రక్తమైసమ్మ జాతర ఉత్సవాలు ఆదివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. అమ్మవారి పల్లకిసేవ అనంతరం భక్తులు అమ్మవారికి బోనాలతో నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్నాయక్, వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, కౌన్సిలర్ రాఘవేందర్తో పాటు పట్టణ ప్రముఖులు, భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అదే విధంగా పోట్లి మహారాజ్ దేవాలయంలో వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.