తాండూరు రూరల్ : తాండూరు మండలం, ఓగిపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రక్తమైసమ్మ దేవాయం ప్రారంభంతో పాటు అమ్మవారి విగ్రహాం ప్రతిష్ఠ, అదే విధంగా ఏల్లమ్మ దేవత విగ్రహాం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన శుక్రవారం గావించారు. అమ్మవారికి గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున బోనమెత్తి మొక్కులు తీర్చుకున్నారు. మరి కొంతమంది అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సర్పంచ్ కోడ్లీ పద్మ, మాజీ సర్పంచ్ బసంత్రావు పటేల్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు.
జాతరను తిలకిచేందుకు కర్నాటకలోని సత్తర్శాల, నిడిగుంద తదితర గ్రామాల నుంచి భక్తులు విచ్చేశారు. అదే విధంగా కరణ్కోట గ్రామం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి మొక్కులు తీర్చుకున్నారు.