పెద్దఅంబర్పేట, సెప్టెంబర్ 23: ఒక్కటి కాదు.. పదుల సంఖ్యలో స్టెప్పులు.. ఒక్కో స్టెప్పునకు ఒక్కో పేరు.. ఒక్కో శబ్దానికి ఒక్కో ఆట తీరు.. ఇదంతా కొ ట్టే శబ్దాన్ని బట్టి ఒక్కో బ్యాండు. ఆ బ్యాండుకు మస్తు డిమాండ్.. అన్నా.. మనం ప్యాడ్ బ్యాండ్ పెట్టాలె. లేదన్నా జాల్నా కొట్టాలె.. ఇదీ వినాయక మండపాల వద్ద వినిపించే పదాలు.. వేస్తున్న స్టెప్పులు. ఊరంతా దద్దరిల్లేలా ప్రత్యేక బ్యాండ్లు బుక్ చేస్తున్నారు. ఐదు నుంచి పది రోజుల వరకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం ఒక ఎత్తైతే.. ఆ తర్వాత నిమజ్జనం సమయంలో ఆకట్టుకునే బ్యాండ్లు ఏర్పాటు చేయడమే ఇప్పుడు స్పెషల్. ఊరంతా ఒక్కటయ్యేలా.. దోస్తులంతా కలిసి స్టెప్పులేసేలా భారీ సౌండ్లు ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రత్యేకంగా డిమాండ్లు ఉన్న బ్యాండ్ల గురించి..
జాల్నా బ్యాండ్ మహారాష్ట్ర..
ప్రత్యేకంగా గణేశ్ నిమజ్జనాల వద్ద ఎక్కువగా వీటిని వాడుతుంటారు. ఇటీవల ఇతర బరాత్లలో అక్కడక్కడ కనిపిస్తున్నాయి. దీనికి పెద్ద డ్రమ్ము వస్తుంది. నిమజ్జనాల వేళ వీటికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఒక రోజుకు రూ.50వేల నుంచి రూ.2 లక్షల వరకు తీసుకుంటారు. ఈ బ్యాండు కొట్టేవారు ఆరుగురు నుంచి 21 మంది వర కు ఉంటారు. ఈ బ్యాండు కొట్టేవారు తప్పనిసరిగా పగిడీలు కట్టి.. డ్రెస్కోడ్ ఫాలో అవుతారు. పుణెలోని జాల్నా అనే ప్రాంతంలో మొదలైన ఈ బ్యాండు దేశవ్యాప్తంగా విస్తరించింది. దీన్ని ఎక్కువగా పుణె లో వినాయక ఆగమనం, నిమజ్జనం సమయంలో వినియోగిస్తుంటారు. ఇప్పుడు హైదరాబాద్, శివారులోనూ దీని వినియోగం పెరిగింది.
పుణె బ్యాండ్..
మరాఠ్ మండల్ వారు ఈ బ్యాండును ఎక్కువగా వినియోగిస్తుంటారు. ప్రస్తుతం అన్నివర్గాల వారు దీనిని ఉపయోగిస్తున్నారు. ఈ బ్యాండ్ను కొట్టేవారిలో మహిళలే ఎక్కువగా ఉంటారు. నెత్తిన పగిడీలు కట్టి.. మరాఠీ తరహా వస్త్రధారణతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రధానంగా గేటెడ్ కమ్యూనిటీలు, పెద్ద, పెద్ద కాలనీల్లో యువతులు పుణె బ్యాండ్ను కొడుతుంటారు. ఒక రోజుకు దీని ధర రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది.
చిటికెలు..
ఇది ప్యాడ్ బ్యాండ్ తరహాలోనే ఉంటుంది. కానీ, భారీ డప్పులు ఉండవు. కేవలం చిన్న డప్పులు మాత్రమే ఉంటాయి. టిపిరిటిపిరి.. డుగ్గా.. డప్పులు ఉంటాయి. తీన్మార్ కొడతారు.
ప్యాడ్ బ్యాండ్ విత్ ఛత్రీ..
హైదరాబాద్తోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో ప్యాడ్ బ్యాండ్కు మంచి డిమాండ్ ఉన్నది. ఇద్దరు పియానో వాయిస్తుండగా.. ఆరుగురు బ్యాండ్ కొట్టేవారు ఉంటారు. బ్యాండ్ కొట్టేవారితోపాటు ఛత్రీల లైట్లు పట్టుకుని వెంట నడుస్తుంటారు. జనరేటర్ సాయంతో ఇవి నడుస్తాయి. ఒక రోజుకు దీని ధర రూ.40 వేల నుంచి రూ.1.5 లక్షల వర కు ఉంటుంది. ప్యాడ్ బ్యాండ్కు పురాణాపూల్ ఫేమస్. నగరంతోపాటు శివారులోని అన్ని ప్రాంతాలకు ఇక్కడే బ్యాండ్ బుక్ అవుతుంది.
జాబ్రి మర్ఫా..
ఇది అరబిక్ పదం. రెండు బిందెలు, రెండు డోళ్లు, ఒక చిన్న గిన్నె ఆకారంలో ఉంటుంది. వీరు తలకు రుమా లు చుట్టుకుని, జుబ్బాలు వేసుకుని లుంగీలు కట్టుకుని బ్యాండ్ కొడుతారు. ఇది ప్రత్యేకంగా బార్కాస్లో అం దుబాటులో ఉంటుంది. వేరేచోట లభించినా.. బా ర్కాస్ బ్యాండ్కు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. రోజుకు దీని ధర రూ. 40 వేల వరకు ఉంటుంది.
కలెక్టరేట్లో ఘనంగా వినాయక నిమజ్జనం
రంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడి నిమజ్జనం శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ భూపాల్రెడ్డి పాల్గొని గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా వినాయకుడి లడ్డూను వేలం పాటలో దక్కించుకున్న కృష్ణ అనే ఉద్యోగికి లడ్డూను కలెక్టర్, అదనపు కలెక్టర్లు అందించారు. కార్యక్రమంలో డీఆర్ఓ సంగీత, ఏవో ప్రమీలారాణి పాల్గొన్నారు. -ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 23