ఇబ్రహీంపట్నం రూరల్, డిసెంబర్ 11: సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. ఇప్పటికే సబ్సిడీపై గొర్రెలు, పశువులు, ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్న ప్రభు త్వం.. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఉపాధి పొందేందుకు సబ్సిడీపై పెరటికోళ్లను అందించేందుకు చర్యలు చేపట్టింది. ఆసక్తి ఉన్న వారికి గుడ్లు పెట్టి బరువు బాగా పెరిగే రెయిన్బో రోస్టర్ రకం కోడిపిల్లలను అం దించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఏడా ది రంగారెడ్డి జిల్లాలో 450 యూనిట్లు పశు సంవర్ధక శాఖ ద్వారా పం పిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో యూనిట్ధర రూ.1850 కాగా, రూ.1,250 సబ్సిడీ వ స్తుంది. లబ్ధిదారు తన వా టాగా రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది. కోళ్లకు వ్యాధులు రాకుండా పశు వైద్యశాఖాధికారులు ముం దుగానే టీకాలు వేయనున్నారు. కోళ్ల పెంపకంపై ఆసక్తి ఉన్న వారికి జిల్లాలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో రాయితీపై పెరటికోళ్లను అందిచేందుకు పశువైద్యాధికారులు కసరత్తు చేస్తున్నారు.
పెరటి కోళ్లకు మంచి డిమాండ్
రైతులకు అటు నాటుకోళ్లు, ఇటు ఫారం కోళ్లు కాకుండా మధ్య తరహా ఉండే రెయిన్బో రోస్టర్ రకం కోళ్ల యూనిట్లను పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం మార్కెట్లో నాటుకోళ్లకు మంచి డిమాండ్ ఉన్నది. ఈ క్రమంలో మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పెరటికోళ్లను పం పిణీ చేస్తున్నది. ఈ కోళ్లు 18 వారాల నుంచి గుడ్లు పెడతాయి. దేశీయ కోడి కంటే రెండింతలు ఎక్కువగా గుడ్లు పెడతాయని అధికారులు చెబుతున్నారు. సాధారణ కోడి గుడ్డుకంటే ఇందులో ప్రోటీన్ల శాతం అధికంగా ఉంటుందని, ఒక్కో గుడ్డు మూడు వందల యాభై గ్రాముల వరకు ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ గుడ్లను తింటే గ్రామీణుల్లో న్యూట్రిషన్ ఇబ్బందులు తొలుగుతాయని అధికారులు భావిస్తున్నారు. నాలుగైదు నెలల్లో ఒక్కో కోడి 1.5 నుంచి 2.6 కిలోల వరకు పెరుగుతుందని.. మాంసంగా విక్రయించినా మంచి లాభాలు ఉంటాయ ని.. ఏడాదిలో ఒక్కో యూనిట్ ద్వారా రూ. 25 వేల వరకు ఆదాయాన్ని ఆర్జించొచ్చని అధికారులు తెలుపుతున్నారు.
ఆసక్తి చూపుతున్న గ్రామీణులు
రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న పెరటి కోళ్ల పెంపకంపై గ్రామీణ ప్రాంత ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. వీటి పెంపకం చాలా సులభంగా ఉండడంతోపాటు తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది. కోళ్ల షెడ్లను నిర్మించుకునేందుకు ప్రభు త్వం ప్రత్యేకంగా రూ. 1500 మంజూరు చేస్తుండటంతో రైతులు ఆసక్తిచూపుతున్నారు.
త్వరలో పెరటికోళ్లను అందిస్తాం
జిల్లాలో మహిళా సంఘాల ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించేందుకు త్వరలో పెరటికోళ్లను అందిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సబ్సిడీ కింద తక్కువ ధరకు లభిస్తా యి. జిల్లాకు 450 యూనిట్లు మంజూరయ్యాయి. ఒక్కో యూనిట్లో 25 కోడిపిల్లలకు రూ.1850 ఉండగా.. ఇందులో రూ.1250 సర్కారు భరిస్తుంది. మిగతా రూ.600 రైతు వాటా కింద చెల్లించాల్సి ఉంటుంది.
-అంజిలప్ప, రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధ్దకశాఖ అధికారి