ఇబ్రహీంపట్నం, మే 19 : మహిళలు వంటింటి నుంచి మొదలై అదే వంటింటికి కావాల్సిన కారం, పసుపు, మసాలాలు తదితర వస్తువులు తయారుచేసి పారిశ్రామికవేత్తలు కావొచ్చని రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితాహరినాథ్రెడ్డి అన్నారు. శుక్రవారం రంగారెడ్డి కలెక్టరేట్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ మిషనరీ ప్రదర్శనను అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన కోసం ప్రభుత్వాలు వి విధ పథకాల కింద అందిస్తున్న తోడ్పాటుతో ఆర్థిక అభివృద్ధి చెందవచ్చన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా సమాఖ్య గ్రూపులకు రూ.10 లక్షల వరకు రుణం అందజేస్తున్నదని తెలిపారు.
అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. రైతులు ఆగ్రో బేస్ వస్తువులను తయారు చేసి ఆర్థికంగా ఎదగవచ్చన్నారు. కలెక్టరేట్లో మహిళా సమాఖ్య గ్రూపులకు కూరగాయలు, పండ్లు విక్రయించేందుకు స్థలం కేటాయించినట్టు చెప్పారు. పోచంపల్లి చేనేత వస్ర్తాలు విక్రయించేందుకు, చిరు ధాన్యాలు అమ్మేందుకు సైతం స్థలం కేటాయిస్తామని పేర్కొన్నారు.
జిల్లా పరిశ్రమల అధికారి రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. బ్యాంకుల నుంచి సబ్సిడీతో కూడిన రుణ సదుపాయం పొందేందుకు సూక్ష్మ తరహా పరిశ్రమల స్థాపన కోసం ఉపయుక్తంగా నిలిచే అధునాతన యంత్ర పరికరాలకు సంబంధించి ఈ ప్రదర్శనలో ప్రయోగాత్మకంగా వివరించారు. అర్హులైన వారికి ప్రభుత్వం 35 శాతం సబ్సిడీతో కూడి న రుణాన్ని మంజూరు చేస్తుందన్నారు. ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద తోడ్పాటును అందిస్తున్నాయని తెలిపారు. ఔత్సాహికులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని విరివిగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ప్రజలకు కూడా ఆహార ఉత్పత్తులు సరిపడా అందుబాటులో వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల పరిశ్రమల మేనేజర్లు రాజేశ్వర్రెడ్డి, వినయ్కుమార్, పవన్, గ్రామీణాభివృద్ధి జిల్లా అధికారి ప్రభాకర్, మెప్మా పీడీ అహ్మద్ సఫీవుల్లా, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి గీతారెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి సునందరాణి, మహిళా సమాఖ్యల గ్రూపు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.