కొండాపూర్, ఫిబ్రవరి 3: టర్కీ సంస్కృతి, సంప్రదాయాలను నగర వాసులకు పరిచయం చేసేందుకు శుక్రవారం మాదాపూర్లోని శిల్పకళా వేదికలో ‘కొన్య టర్కీష్ సూఫీ’ సంగీత కచేరీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టర్కీ కాన్సుల్ జనరల్ ఓర్హన్ యల్మన్ ఓకన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇరు దేశాలు వేరైనప్పటికీ సంస్కృతులు ఒకేలా ఉంటాయన్నారు. హైదరాబాద్ నగర వాసులు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తారని, అందుకే టర్కీలో ప్రముఖమైన సూఫీ సంగీతాన్ని ఇక్కడి వాసులకు పరిచయం చేసేందుకు ప్రత్యేకంగా సంగీత కచేరిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రదర్శనల్లో భాగంగా నెయ్, కుడుం, తంబుర, తెఫ్ తదితర వాయిద్యాలతో కళాకారులు ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ సెక్రటరీ అర్వింద్కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, పొల్యూషన్ కంట్రోల్బోర్డు మెంబర్ సెక్రటరీ సందీప్కుమార్ నీతూ ప్రసాద్, టూరిజం అండ్ కల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, డీజీపీ అంజనీ కుమార్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ సీఈఓ కరణ్ బజాజ్, డ్రైడెంట్ జనరల్ మేనేజర్ ధీరజ్ మెహతా, కళాకారులు పాల్గొన్నారు.