హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ఆరాంఘర్ చౌరస్తా-శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గంలో రోడ్డు అభివృ ద్ధి, విస్తరణ పనులను మరింత వేగవంతం చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించా రు. సోమవారం హైదరాబాద్లోని బీఆర్కేఆర్ భవన్లో ఆర్అండ్బీ, ట్రాన్స్కో, రెవె న్యూ, ఎండోమెంట్స్, వక్ఫ్బోర్డు తదితర శాఖ ల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రూ.283 కోట్లతో 10 కిలోమీటర్ల మే ర ఆరులేన్ల రోడ్డు విస్తరణ, రెండు సర్వీస్ రోడ్ల పనులను చేపట్టారు. వీటితోపాటు, వ్య వసాయ వర్సిటీ, ఎయిర్పోర్ట్ ప్రవేశ మార్గాల వద్ద అండర్పాస్లు, గగన్పహాడ్ వద్ద ఫ్లైఓవర్, శంషాబాద్టౌన్లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. కాగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రోడ్డు విస్తరణ పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు.
ప్రజలకు ఇబ్బందుల్లేకుండా పనులు చేపట్టాలని సూచించారు. రోడ్డు విస్తరణకు అడ్డంకిగా ఉన్న విషయాలపై ప్రజాప్రతినిధులతో వెంటనే సమావేశం నిర్వహించాలని.. వచ్చే నెలాఖరులోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పను ల పురోగతిపై తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని సీఎస్ స్పష్టం చేశారు. సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ కార్యదర్శి అనిల్కుమార్, రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్, వక్ఫ్బోర్డు కార్యనిర్వహణ అధికారి ఖాసీమ్, విద్యుత్ శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు, ట్రాన్స్కో డైరెక్టర్ జగత్ రెడ్డి, ధర్మారెడ్డి, చంద్రకళ, భాసర్ పాల్గొన్నారు.