సిటీబ్యూరో, జూలై 7(నమస్తే తెలంగాణ) : ఇక్రిసాట్, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ మధ్య కీలక ఒప్పం దం కుదిరింది. దేశవ్యాప్తంగా మిల్లెట్, పప్పు ధాన్యాల దిగుబడిని పెంచడంతోపాటు ఆయా దినుసులతో ఆహార పదార్థాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ఇరు సంస్థలకు చెందిన పరిశోధకులు కృషి చేయనున్నారు.
ఇటీవల కాలంలో పోషకాహారంలో అత్యంత ఆదరణ పొందుతున్న మిల్లెట్స్ను ప్రోత్సహించేలా ఇరు సంస్థలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. మైసూర్లోని సీఎఫ్టీఆర్ఐలో జరుగుతున్న ‘వన్ వీక్-వన్ ల్యాబ్’ కార్యక్రమంలో భాగంగా ఈ ఒప్పందం జరిగింది. హైదరాబాద్ వేదిక రిసోర్స్ సెంటర్ ద్వారా పుడ్ టెక్నాలజీపై సీఎఫ్టీఆర్ఐ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుండగా, ఇక్రిసాట్తో ఒప్పందం వల్ల మిల్లెట్ ఆహార పదార్థాల ఉత్పత్తి మరింత పెంచేందుకు సాయపడనున్నదని పరిశోధకులు తెలిపారు.